Vishwak Sen : ప్రభాస్ 'కల్కి' పై యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్..ఫైర్ అయిన విశ్వక్ సేన్, వైరల్ అవుతున్న పోస్ట్!

'కల్కి' మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అతనిపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అయ్యాడు. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో అతన్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు.' సినిమాపై ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి' అని అన్నాడు.

New Update
Vishwak Sen : ప్రభాస్ 'కల్కి' పై యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్..ఫైర్ అయిన విశ్వక్ సేన్, వైరల్ అవుతున్న పోస్ట్!

Vishwak Sen Fires On Youtuber : 'మహానటి' మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం ‘కల్కి 2898AD’ (Kalki 2898). వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తాజాగా కల్కి మూవీపై ఓ యూట్యూబర్ నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అతనిపై యంగ్ హీరో విశ్వక్ సేన్ ఫైర్ అవుతూ పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

పైరసీ కంటే డేంజర్

బార్బెల్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ (Barbell Pitch Meetings) ర‌న్ చేస్తున్న ఒక తెలుగు యూట్యూబ‌ర్ 'క‌ల్కి' సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు. అయితే ఈ కామెంట్స్‌పై విశ్వక్ సేన్ రియాక్ట్ అవుతూ తన ఇన్ స్టాగ్రామ్ లో అతన్ని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టాడు. అందులో.."సినిమాలు రిలీజ్ కూడా అవకముందే చెంబులు పట్టుకొని కొంద‌రూ బయలుదేరుతున్నారు. యూట్యూబ్‍లో మీ ఆదాయం పెంచుకోవడం కోసం వేల కుటుంబాలు నడుస్తున్న సినిమా ఇండస్ట్రీతో మజాక్‍లు అయిపోయాయి మీకు.

Also Read : ‘పుష్ప 2’ వాయిదాతో హర్ట్ అయిన అభిమాని.. కోర్టులో కేసు వేస్తా అంటూ మేకర్స్ పై ఆగ్రహం!

వీడు ఒక పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం.. లేదంటే అడ్రస్ తప్పిపోయిన వాళ్లు అనుకుని ఇగ్నోర్ చేద్దాం.. ఇలా విమర్శలు చేసే వారంతా కూడా ఓ పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. అప్పుడు మీకు, మీ ఒపీనియన్‍కు కాస్త గౌరవం ఉంటుంది. మన చుట్టూ ఉన్న కొంత మంది పైరసీ కంటే డేంజర్. సినిమా కోసం ఇక్కడ చిందించే రక్తం, చెమటను, ఎంతో మందికి జోవనోపాధిని ఇస్తున్న ఈ ఇండస్ట్రీని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను" అంటూ రాసుకొచ్చాడు.

publive-image

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది. 

New Update

BIG BREAKING: నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు రూ.3.4 కోట్లు తీసుకున్నట్లుగా ఈడీ గుర్తించింది. 

రూ.5.9 కోట్లు పారితోషికం.. 

ఈ మేరకు ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనుగోలుదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఇందులో భాగంగానే మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం ఏప్రిల్ 27న నటుడు మహేష్ బాబుకు సమన్లు ​జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ప్రచారం కోసం మహేష్ బాబు ఆమోదం తెలిపారని ఆరోపణలు ఉన్నాయి. సాయి సూర్య డెవలపర్స్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినందుకు ఆయన రూ.5.9 కోట్లు అందుకున్నారని ED వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.3.4 కోట్లు చెక్కు ద్వారా, 2.5 కోట్లు నగదు ద్వారా చెల్లించారు. మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించిన లాండరింగ్ డబ్బులో భాగంగా ఈ నగదు భాగం ఉందని ED అధికారులు అనుమానిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని కె. సతీష్ చంద్ర గుప్తా, ఇతరులపై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ED తన మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. అనధికార లేఅవుట్‌లలో ప్లాట్‌లను అందించడం, ఒకే ప్లాట్‌లను రెండు, మూడుసార్లు అమ్మడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం ద్వారా కొనుగోలుదారుల నుంచి ఈ సంస్థలు ముందస్తుగా కోట్లు వసూలు చేశాయని ఆరోపణలున్నాయి. ఈ వెంచర్ వెనుక ఉన్న మోసపూరిత పద్ధతుల గురించి తెలియక చాలా మంది పెట్టుబడి పెట్టేలా మహేష్ ప్రభావితం చేశారు. ఈ కుంభకోణం కార్యాచరణ అంశాలలో మహేష్ ప్రమేయం ఉండకపోవచ్చు, కానీ డెవలపర్ల నుంచి అతను అందుకున్న డబ్బును ED పరిశీలిస్తోంది.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఏప్రిల్ 16న జరిగిన సోదాల్లో, సురానా గ్రూప్ అధిపతి నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ ప్రాంగణాల నుంచి పలు పత్రాలు, నగదు సంబంధిత ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు ED పేర్కొంది. ఈ పత్రాలు పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలను సూచిస్తున్నాయని, వీటిలో రూ. 100 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయని ED తెలిపింది.

 telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment