BREAKING: కాంగ్రెస్లో చేరిన విజయశాంతి ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. By V.J Reddy 17 Nov 2023 in రాజకీయాలు Uncategorized New Update షేర్ చేయండి Vijaya Shanthi Joined In Congress: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న విజయశాంతి ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మల్లిఖార్జున ఖర్గే. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ALSO READ: లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు.. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం విజయశాంతి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని తెలిపారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ను ఫామ్హౌజ్కే పరిమితం చేయాలని కాంగ్రెస్ పార్టీలో తాను చేరినట్లు వెల్లడించారు. ALSO READ: ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు.. #telangana-news #telangana-elections-2023 #vijayashanthi-joined-congress సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి