Vijayasai Reddy: జగన్ కి ప్రత్యేక ధన్యవాదాలు.. విజయసాయి ట్వీట్ వైరల్..! వైసీపీ సీనియర్ నేత విజయసాయి ఎన్నికల ఫలితాలపై సోషల్ మీడియాలో స్పందించారు. నెల్లూరు లోక్సభకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు జగన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ ఇచ్చారు. By Jyoshna Sappogula 05 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ నెల్లూరు New Update షేర్ చేయండి Vijayasai Reddy: నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓటమిని చవిచూసిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి ఎన్నికల ఫలితాలపై మరోసారి సోషల్ మీడియాలో స్పందించారు. నెల్లూరు లోక్సభకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు. Also read: కంగ్రాచ్యులేషన్స్ మిత్రమా.. నీకంటే అర్హులెవరూ లేరు.. పవన్ కు విక్టరీ వెంకీ విషెస్..! జయాపజయాలతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా.. సమస్యల పరిష్కారానికి, నెల్లూరు అభివృద్ధికి కృషి చేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. తనకు మద్దతు ప్రకటించి., సహాయ సహకారాలు అందించిన జిల్లా ప్రజానీకానికి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు లోక్ సభ స్థానానికి పోటీ చేసిన నాకు మద్దతు ప్రకటించి, సహాయ సహకారాలు అందించిన నెల్లూరు ప్రజానీకానికి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నెల్లూరు లోక్ సభకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా… — Vijayasai Reddy V (@VSReddy_MP) June 5, 2024 #vijayasai-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి