Andhra Pradesh : ఘనంగా వైఎస్‌ఆర్‌ 75వ జయంతి.. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల.. భావోద్వేగానికి లోనైన విజయమ్మ..!

వైఎస్‌ఆర్‌ 75వ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ అయ్యారు. ఇడుపులపాయలో వైఎస్‌ఆర్‌కి ఆమె నివాళులర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన విజయమ్మ కొడుకు జగన్ ను ముద్దాడి కంటతడి పెట్టుకున్నారు.

New Update
Andhra Pradesh : ఘనంగా వైఎస్‌ఆర్‌ 75వ జయంతి.. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల.. భావోద్వేగానికి లోనైన విజయమ్మ..!

YSR 75th Jayanthi : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) 75వ జయంతి వేడుకలు ఏపీలో పోటాపోటీ జరుగుతున్నాయి. ఇడుపులపాయలో మాజీ సీఎం జగన్ (Jagan) వైఎస్‌ఆర్‌కి నివాళులు అర్పించారు. ఆ తరువాత ఏపీసీసీ చీఫ్ షర్మిల (Sharmila) తల్లి విజయమ్మ (Vijayamma), భర్త అనిల్, కూతురు, కొడుకు కోడలుతో కలిసి వైఎస్ కు నివాళులర్పించారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ కి ఈ పరిస్థితి ఉండేది కాదు.. రాహుల్‌ గాంధీ స్పెషల్ వీడియో..!

ఈ సందర్భంగా జగన్ ను చూసి భావోద్వేగానికి లోనైన విజయమ్మ ఆయనను ముద్దాడి కంట తడి పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళగిరిలో షర్మిల వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) హాజరుకానున్నారు. మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలోనూ ఏపీ వ్యాప్తంగా జయంతి వేడుకలు జరుపుతున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment