/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mavulla-jpg.webp)
శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో పలు ఆలయాలు భక్తులతో కిటకిటలడాయి. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు రోడ్లో గల శ్రీ విజయ దుర్గ అమ్మవారు ధనలక్ష్మి దేవిగా దర్శనం ఇచ్చారు.
సుమారు పది లక్షల కరెన్సీ నోట్లతో అమ్మవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని నోట్లను అలంకరించామని తెలిపారు.
తిరుపతిలో తిరుచానూరు పద్మావతి అమ్మవారిని హీరో నవీన్ పోలిశెట్టి దర్శించుకున్నారు.
నవీన్ పొలిశెట్టిన చూసేందుకు అభిమానులు ఆలయం వద్దకు భారీగా వచ్చారు. దీంతో వాహనం ఎక్కి అభిమానులకు ఆయన అభివాదం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఇక నగరిలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి రోజా పాల్గొన్నారు. వ్రతం సందర్బంగా నగరి మహిళల పాదాలకు మంత్రి రోజా పసుపు పూశారు. అనంతరం తాంబూలం సమర్పించి వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఇక సుప్రసిద్ధ ఆలయం భీమవరంలో పట్టణ ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు అభిషేకాలు కుంకుమార్చన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి పోటెత్తారు.
YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చంద్రబాబు చూస్తున్నాడని ఆరోపించారు.
వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) సభ్యులతో ఆ పార్టీ అధినేత జగన్ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. బూత్ లెవల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల తరపున పోరాటాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. పార్టీ పీఏసీ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలన్నారు. ఇంకా సమయం ఉందని వేచి చూసే ధోరణి వద్దని హెచ్చరించారు. విశాఖలో రూ.3 వేల కోట్ల భూమిని చంద్రబాబు సర్కార్ ఊరు, పేరు లేని కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. లులూ గ్రూప్కు రూ.2 వేల కోట్ల భూమిని కట్టబెట్టారన్నారు. రాజధానిలో నిర్మాణ పనుల అంచనాలను పెంచేశారని ఆరోపించారు. ఇచ్చిన హామీలు ఎక్కడా అమలు చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు.
దిగజారిన వ్యవస్థలు..
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోతున్నాయని ఈ సమావేశంలో జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. IPS ఆంజనేయులు అరెస్ట్ ఈ పరాకాష్టకు నిదర్శనమని ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెట్టుకొని ఎలాగైనా మిథున్ రెడ్డిని లిక్కర్ కేసులో ఇరికించాలని చూస్తున్నాడని ఆరోపించారు.
(ys-jagan | telugu-news | telugu breaking news)