Vangalapudi Anita: రోజా నోరు జాగ్రత్త..!

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ మంత్రి రోజాపై టీడీపీ మహళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిపై అనుచితంగా మాట్లాడుతున్న రోజా.. చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు.

New Update
Vangalapudi Anita: రోజా నోరు జాగ్రత్త..!

ఆంధ్రప్రదేశ్‌ టూరిజం శాఖ మంత్రి రోజాపై టీడీపీ మహళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడిపై అనుచితంగా మాట్లాడుతున్న రోజా.. చంద్రబాబు రాజకీయ బిక్ష పెట్టకపోతే నీ పరిస్థితి ఏమయ్యేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడి వల్లే రోజా రాజకీయాల్లోకి వచ్చారని అనిత గుర్తు చేశారు. రోజా సినిమా సెట్‌లో డైలాగ్‌ చెప్పినట్లు మీడియా ముందు మాట్లాడుతున్నారన్నారు. రోజా భువనేశ్వరి కాళ్లు పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయన్న అనిత.. ఇప్పుడు జగన్‌ మోచేతి నీళ్లు పట్టుకొని తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడు గతంలో క్షమించకుంటే నీ గతి ఏమయ్యేదని అని వంగలపూడి అనిత రోజాను ప్రశ్నించారు. ఇకపై రోజా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలన్నారు. లేకుంటే తెలుగు దేశానికి చెందిన మహిళలు తమిళనాడుకు తరిమికొడతారని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

రోజా ఏమన్నారంటే.?

చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని కట్టబెడితే బాబు మాత్రం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలంటూ స్కిల్ డెవలప్‌ మెంట్‌ స్కీమ్‌ పేరుతో పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారని మంత్రి రోజా మండిపడ్డారు. పలు కంపెనీల ద్వారా చంద్రబాబు సుమారు 371 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకున్నాడని విమర్శించారు.

చంద్రబాబు ఆ స్కామ్‌లో అన్ని ఆధారాలతో దొంగలా దొరికి జైల్లో కూర్చుంటే ఆయన కోడలు బ్రాహ్మణి చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలంతా గంటకొట్టి బాబుకు సంఘీభావం తెలపాలని కోరడం ఏంటన్నారు. బహుశా బ్రాహ్మణికి అసలు సైకో ఎవరో తెలియక ట్విట్‌లు పెడుతున్నట్లు ఉన్నారని రోజా ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో అసలు సైకోలు చంద్రబాబు నాయుడు, ఆయన బావమరిది బాలకృష్ణ అని మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీని సినిమా సెట్ అనుకుంటున్నాడని రోజా ఎద్దేవా చేశారు. అందుకే ఆయన తొడలు కొట్టడం, విజుల్స్‌ వేయడం లాంటి వికృత చేష్టలు చేశారని విమర్శించారు.

మరోవైపు నారా లోకేష్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన రోజా.. లోకేష్‌ చేపట్టిన యువగళం యాత్రకు ప్రజా స్పందన కరువైందన్నారు. లోకేష్‌ టీడీపీ నేతలతో తన యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో నారా లోకేష్‌ సైతం జైల్లో కూర్చోక తప్పదని మంత్రి రోజా మండిపడ్డారు. తండ్రి చేసిన తప్పుల్లో తనయుడి పాత్ర కూడా ఉందని రోజా అన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఒకే జైల్లో కూర్చొని చిప్పకూడు తినడం ఖాయమని టూరిజం శాఖ మంత్రి జోస్యం చెప్పారు.

ALSO READ: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది

New Update
Rains

Rains

ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. అలాగే కొన్నిచోట్ల వడగాలులు వీచే అవకాశాలుకూడా ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 24 గంటల్లో బలపడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీనికి అనుబంధంగా వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో గురువారం పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

గురువారం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

అల్పపీడనం ప్రభావంతో శుక్రవారం కూడా ఏపీలో వర్షాలు పడనున్నాయని అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్య సాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు.

ఇదే సమయంలో కొన్ని జిల్లాలలో ఎండలు పెరుగుతున్నాయి. బుధవారం కర్నూలు జిల్లా ఉలిందకొండలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, నంద్యాల జిల్లా దొర్నిపాడు, పల్నాడు జిల్లా అమరావతిలో 39.7,ప్రకాశం జిల్లా దరిమడుగలో40.3 , చిత్తూరు జిల్లా తవణంపల్లెలో40.1  , వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో39.9 డిగ్రీల  ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురువారం పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 17 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని.. శుక్రవారం7 మండలాల్లో తీవ్రవడగాలులు, 66 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: GT Vs RR: గుజరాత్ తొలి ఇన్నింగ్స్ పూర్తి.. రాజస్తాన్ టార్గెంట్ ఎంతంటే?

ap | rains | weather | andhra pradesh weather | andhra-pradesh-weather-forecast | andhra-pradesh-weather-report | ap today weather update | ap-weather | AP Weather Alert | latest-news | telugu-news | ap telugu news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment