US: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు!

అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పేరు అధికారికంగా ఖరారు అయ్యింది. ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించాడు.వాన్స్ మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతి మహిళ.

New Update
US: అమెరికా ఉపాధ్యక్షుడి బరిలో తెలుగింటి అల్లుడు!

Usha Chilukuri Vance: అమెరికాలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో..రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) పేరు అధికారికంగా ఓకే అయిన సంగతి తెలిసిందే. మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్ అభ్యర్థిత్వానికి ఆమోదముద్ర వేశారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ (JD Vance) పేరును ట్రంప్ ప్రకటించాడు. 39ఏళ్ల వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు.

మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చిన వాన్స్.. చివరకు ట్రంప్ విధేయుడిగా మారాడు. దీంతో ట్రంప్ అతన్ని రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా తెలిపారు. ఇంతకీ ఈ వాన్స్ ఎవరో కాదు..మన తెలుగింటి అల్లుడే. ఆయన భార్య ఉషా చిలుకూరి భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టిపెరిగారు. యేల్ విశ్వవిద్యాలయంలో లా అండ్ టెక్ జర్నల్ కు మేనేజింగ్ ఎడిటర్ గా, యేల్ లా జర్నల్ కు ఎగ్జిక్యూటివ్ డెవలప్ మెంట్ ఎడిటర్ గా చేశారు. యేల్ విశ్వవిద్యాలయంలోనే ఉషా, జేడీ వాన్స్ తొలిసారి కలుసుకున్నారు. 2014లో వారి వివాహం జరిగింది. హిందూ సంప్రదాయ పద్దతిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.

జేడీ వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. ఒహాయో స్టేట్ యూనివర్శిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్నారు. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందాడు. వాన్స్ 2022లో అమెరికా సెనేట్ కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఒహాయో సెనేటర్ గా పోటీచేస్తున్న సమయంలో ఉషా చిలుకూరి ప్రచారంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. భర్త విజయంలో కీలక పాత్ర పోషించారు.

వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో వివేక్ రామస్వామి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. జేడీ వాన్స్ పేరును ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అతడో గొప్ప ఉపాధ్యక్షుడు అవుతాడని ప్రశంసించారు.

Also read: నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు…హోం మినిస్టర్‌ తో భేటీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Iran Nuclear Deal: సైనిక చర్యలు తప్పువు.. ఇరాన్ డీల్ పై ట్రంప్ మరోసారి..

ఇరాన్ తో అణు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డీల్ కు ఇరాన్ అంగీకరించకపోతే సైనిక చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇజ్రాయెల్ కూడా తమతో కలుస్తుందని అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update
usa

USA Nuclear Deal With Iran

Iran Nuclear Deal: ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.  దీనికి సంబంధించి ఈరోజు విలేఖరుల సమావేశంలో ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అణు ఒప్పందానికి అంగీకరించకపోతే సైనిక చర్యలు ఉంటాయా అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..అవసరమైతే కచ్చితంగా చేస్తామని ఆయన అన్నారు. వారు న్యూ క్లియర్ డీల్ కు ఒప్పుకోకపోతే సైనిక చర్యలకు దిగుతామని చెప్పారు. ఇందులో ఇజ్రాయెల్‌ ప్రమేయం కూడా ఉంటుంది అని ట్రంప్ తెలిపారు. న్యూక్లియర్ డీల్ పై ఈ శనివారం ఒమన్ లో ట్రంప్ ఉన్నత స్థాయి చర్చలు చేయనున్నారు. 

నిరాకరిస్తే... దాడులు తప్పవు..!

ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్‌ నిరాకరిస్తే...బాంబుదాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదే విధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. అయితే ఇరాన్‌ తో పరోక్ష చర్చలకు అంగీకరిస్తారా? లేదా అనే దాని పై మాత్రం ట్రంప్‌ స్పష్టతనివ్వలేదు. కానీ ఇరాన్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రకటన చేసింది. అమెరికాతో పరోక్ష ఉన్నతస్థాయి చర్చలు మాత్రమే ఉంటాయని తెలిపింది.  ట్రంప్‌ తొలి హయాంలో ఇరాన్‌ తో సంబంధాలు అంతంతమాత్రంగానే సాగాయి. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

మొదటి సారి ట్రంప్ అమెరికా  అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018 లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌ పై ఆంక్షలు విధించింది. అప్పటి నుంచి ఎన్నో ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్‌ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు.  అణుఒప్పందంపై ఇరాన్‌తో చర్చలు జరిపేందుకే ప్రాధాన్యం ఇస్తానని, ఎందుకంటే తాను ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదని ఆయన చెప్పారు. 

 today-latest-news-in-telugu | usa | iran | nuclear | deal

Also Read: China: స్నేహం కావాలి..అమెరికా దెబ్బకు చైనాకు భారత్ గుర్తొచ్చింది..

Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!

Advertisment
Advertisment
Advertisment