మెడికో రమేశ్ ఆత్మహత్య కేసు...ప్రేమ వ్యవహారమే కారణం... !

మెడికో రమేశ్ కృష్ణ అనుమానాస్పద కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆమె వాట్సాప్ చాటింగ్, ఫోన్ డేటా ఆధారంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రమేశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రియుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు వర్గాల ద్వారా తెలుస్తోంది.

author-image
By G Ramu
New Update
మెడికో రమేశ్ ఆత్మహత్య కేసు...ప్రేమ వ్యవహారమే కారణం... !

మెడికో రమేశ్ కృష్ణ అనుమానాస్పద కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆమె వాట్సాప్ చాటింగ్, ఫోన్ డేటా ఆధారంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసులో రమేశ్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రియుడితో మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మ హత్యకు పాల్పడినట్టు పోలీసులు వర్గాల ద్వారా తెలుస్తోంది.

కేరళలోని త్రిశూర్ జిల్లా, వందనపల్లి మండలం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన మెడికో రమేశ్ కృష్ణ చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఇటీవల సెలవుల నేపథ్యంలో ఆమె సొంత గ్రామానికి వచ్చింది. మళ్లీ చైనాకు వెళ్తున్నట్టు చెప్పి ఈ నెల 23న ఆమె విశాఖకు వచ్చినట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఇండోర్ లో ఆమె తన ప్రియున్ని కలుసుకున్నారు. అక్కడి నుంచి సింగపూర్ కనెక్టెట్ ఫ్లైట్ కు ఆమె టికెట్ బుక్ చేసుకున్నట్టు సమాచారం.

ఈ క్రమంలోనే తన ప్రియునితో ఆమెకు గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది. తాజాగా ప్రియునితో ఆమె చేసిన వాట్సాప్ చాట్ తాలుకు వివరాలను పోలీసులు సేకరించారు. ప్రియునితో మనస్పర్థల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలా వుంటే డాబా గార్డెన్ లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్ట గుర్తించిన లాడ్జ్ నిర్వహకులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు లాడ్జ్ కు చేరుకున్నారు. తలుపులు పగుల గొట్టి లోపలికి వెళ్లారు. మృత దేహాన్ని కిందకు దించి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృత దేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం పోలీసు స్టేషన్ కు తరలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు