శివయ్య కటాక్షం కోసం ఏకంగా తలనే నరుక్కున్నాడు

దైవభక్తి ఉండాలి కానీ మరి ఎక్కువ అయితే ప్రాణాలే పోతాయి. దేవుళ్ల ప్రసన్నం కోసం ఘోర తపస్సు చేస్తుండటం సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో కూడా కొందరు ఇలాగే చేస్తున్నారు. ఏకంగా దేవుడు రమ్మనారంటూ ఏకంగా ప్రాణాలు కూడా తీసుకున్న ఘటనలు వినే ఉంటారు. ఇప్పుడు అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

New Update
శివయ్య కటాక్షం కోసం ఏకంగా తలనే నరుక్కున్నాడు

శివుడి ప్రసన్నం కోసం..

టెక్నాలజీలో ప్రపంచం దూసుకుపోతున్నా.. మూఢ విశ్వాసాలను మాత్రం కొందరు వదలడం లేదు. దేవుడు పిలుస్తున్నాడని కొందరు.. ఆయన దగ్గరకు వెళ్తున్నామంటూ మరికొందరు.. అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు శివుడిపై భక్తితో ఎవరూ చేయని సాహసానికి ఒడిగట్టాడు. 30ఏళ్ల ఉన్న దీపక్‌ కుశ్వహ అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున దగ్గర్లోని శివాలయానికి వెళ్లాడు. శివుడి అంటే ఎంతో భక్తి ఉన్న దీపక్.. శివుడికి నైవేద్యంగా చెట్లు కోసే రంపాన్ని పెట్టాడు. అనంతరం ప్రార్థనలు చేసి శివుడి ప్రసన్నకం కోసం రంపంతో తన తలను నరుకోవడం ప్రారంభించాడు. ఈ క్రమంలో నొప్పి భరించలేక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఝాన్సీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుదోంది.

తన తలను శివయ్యకు బలి ఇస్తా..

దీపక్ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ దారుణ ఘటనపై దీపక్ తండ్రి పల్తూరామ్ స్పందించారు. తన కుమారుడికి పరమశివుడు అంటే ఎంతో భక్తి అని.. ఎంతో ఇష్టంగా శివయ్యను కొలుస్తాడని తెలిపారు. గత కొన్ని నెలలుగా తన శిరస్సును బలి ఇచ్చి శివుడిని ప్రసన్నం చేసుకోవాలని కోరికను కూడా వ్యక్తం చేసేవాడని పేర్కొన్నారు. ఓ నోట్ బుక్‌లో శివుడి గురించి ఎన్నో వ్యాఖ్యాలు రాసేవాడన్నారు. అలాగే ఓ పేజీలో తన తలను శివుడికి సమర్పిస్తానని కూడా రాశాడని ఆయన వెల్లడించారు. ఇలా చేయడం పిచ్చి, మూర్ఖత్వం అని ఎన్నో సార్లు చెప్పానని వాపోయారు. అయినా కానీ తన మాట వినకుండా ఇలా చేశాడన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి ఎవరూ ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని కోరుతున్నారు. దేవుడిని భక్తితో పూజించాలే తప్ప.. ప్రసన్నం కోసం ఇలా చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు.

మనదపల్లె ఘటన గుర్తుందా..

గతంలో ఏపీలో కూడా ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన జంట హత్యల కేసు గుర్తుందిగా. తల్లిదండ్రులే కన్నబిడ్డలను అత్యంత కర్కషంగా చంపేసిన ఘటన కళ్లముందు కదలాడుతోంది. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు పరిధి దాటిన ఆధ్యాత్మిక ఆలోచనలతో సొంత బిడ్డలను దారుణంగా చంపేశారు. శూలంతో పొడిచి ఒకరిని, నోటిలో రాగి చెంబును పెట్టి దాన్ని డంబెల్‌తో బాది మరొకరని చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

తాము పార్వతీ పరమేశ్వరులని త్వరలోనే కొత్త లోకాన్ని సృష్టిస్తామని తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని అందరు షాక్ అయ్యారు. ప్రాణాలు పోయిన ఇద్దరు కూతుళ్లు మరికొన్ని గంటల్లోనే తిరిగి లేస్తారని చెప్పడం చూస్తే మితిమీరిన ఆధ్యాత్మిక ఆలోచనలు మనుషులను ఎంతలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. దయచేసిన ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచనలకు దూరంగా ఉండండి. దైవభక్తిలో మునిగిన చాలామందికి సమాజంపై చెడు అభిప్రాయం ఉంటుంది. దీనిని బాగుచేయాలనే ఆలోచనలతో జీవిస్తుంటారు. లోలోపల సతమవుతూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి వారిని వెంటనే సైకియాట్రిస్టులకు చూపించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనార్థాలు జరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు