ఆ నటికి నాన్ బెయిలబుల్ వారెంట్..ఎందుకంటే!

నటి జయప్రదకు యూపీ కోర్ట్‌ నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. గత ఎన్నికల సమయంలో ఆమె ఎలక్షన్‌ కోడ్‌ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు ఈ వారెంట్‌ ఇష్యూ చేసింది.

New Update
Jayaprada: జయప్రద పరారీలో ఉందంటూ.. ప్రకటించిన స్పెషల్ కోర్టు.!

సీనియర్‌ నటి, బీజేపీ నేత జయప్రద (Jayaprada) కు గత కొద్ది రోజుల నుంచి షాక్‌ ల మీద షాక్‌ లు తగులుతున్నాయి. ఆమెకు ఏదోక విధంగా కోర్టు నుంచి అక్షింతలు పడుతూనే ఉన్నాయి. గత నెలలో ఓ కేసులో వెంటనే కోర్టులో లొంగిపోవడంతో పాటు..20 లక్షలు డిపాజిట్‌ చేయాలని కోర్టు నోటీసులు ఇచ్చింది.

తాజాగా మరో కేసులో యూపీ కోర్టు (UP court) నాన్‌ బెయిలబుల్‌ (Non - Bailable ) వారెంట్ జారీ చేసింది. ఆమె గత ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్‌ ను ఉల్లంఘించినందుకు ఆమెకు కోర్టు నోటీసులు ఇచ్చింది. 2019 లో లోక్‌ సభ ఎన్నికల ప్రచారం సమయంలో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘించినందుకు యూపీ జిల్లాలోని కోర్టు శుక్రవారం నాన్‌ బెయిల్‌బుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

నటి కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆమె పై జారీ చేసిన వారెంట్‌ అమలులో ఉంటుందని స్పెషల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ శోభత్‌ బన్సల్‌ తెలిపారని ప్రాసిక్యూటర్‌ అధికారి నీరజ్‌ కుమార్‌ వివరించారు. ఇలా కోర్టు వారెంట్‌ ను కొనసాగించడం ఇది నాలుగో సారి. దీని గురించి తరువాత విచారణ నవంబర్‌ 24న ఉండనుంది.

ఈ కేసు గురించి జయప్రద కోర్టుకు హాజరు కాకపోవడంతో పాటు ఎటువంటి సమాధానం కూడా ఇవ్వడం లేదు. దీంతో పోలీసులు జయప్రదను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచవచ్చని నీరజ్‌ కుమార్‌ అన్నారు. 2019 ఎన్నికలో ప్రచారంలో జయప్రద పై స్వర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదైంది.

ఇది రాంపూర్‌ ఎంపీ ఎమ్మెల్యే కోర్టులో ఇది ఎప్పటి నుంచో పెండింగ్‌ లో ఉంది. జయప్రద 2019 లోక్‌ సభ ఎన్నికల్లో రాంపూర్‌ నుంచి బీజేపీ
నుంచి పోటీ చేశారు. . ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక రహదారిని ప్రారంభించినందుకు ఆమెపై కేసు నమోదైంది.

గత నెలలో జయప్రదను 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలంటూ మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా 20 లక్షల రూపాయలను కూడా డిపాజిట్‌ చేయాలని తీర్పునిచ్చింది. ఉద్యోగులకు ఈఎస్‌ ఐ చెల్లింపులో అవకతవకల కేసులో జయప్రద మీద కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ నటి కోర్టును ఆశ్రయించారు.

కేసు పూర్వాపరాలను పరిశీలించిన తరువాత మద్రాసు హైకోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. కొంతకాలం క్రితం జయప్రద చెన్నైకి చెందిన రామ్ కుమార్‌, రాజ్‌ బాబు అనే వ్యక్తులతో కలిసి తమిళనాడులోని అన్నాసాలైలో ఓ థియేటర్‌ ను ఏర్పాటు చేసి నిర్వహించారు. ఆ థియేటర్‌ లో చాలా మంది ఉద్యోగులు పని చేసేవారు.

వారందరికీ ఈఎస్‌ఐ లు చెల్లించడంలో జయప్రదతో పాటు, రామ్‌ కుమార్‌, రాజ్‌ బాబు ముగ్గురు కూడా అవకతవకలకు పాల్పడినట్లు కేసు నమోదు అయ్యింది. దీని గురించి ఎగ్మూర్‌ కోర్టులో కేసు దాఖలైంది. ఆ సమయంలో జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరికి కూడా ఆరు నెలల జైలు శిక్ష విధించడంతో పాటు రూ. 5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పును చెప్పింది.

Also read: వాళ్లంతా బచ్చాగాళ్లు..పటాన్ చెరులో ఎగిరేది గులాబీ జెండా…గూడెం మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్…!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment