Uber : 27 రూపాయలకు కక్కుర్తి పడిన క్యాబ్ డ్రైవర్‌ ... 28 వేలు జరిమానా కట్టిన కంపెనీ!

ఉబర్ క్యాబ్ డ్రైవర్ .. ఓ ప్రయాణికుడి నుంచి అసలు ఛార్జ్ కంటే.. అధికంగా రూ. 27 లను వసూల్ చేశాడు.దీంతో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌ ఇండియా ఏకంగా ఆ వ్యక్తికి రూ. 28 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది.అసలేం జరిగింది.. అనే విషయాలను ఈ కథనంలో చదివేయండి...

New Update
Uber : 27 రూపాయలకు కక్కుర్తి పడిన క్యాబ్ డ్రైవర్‌ ... 28 వేలు జరిమానా కట్టిన కంపెనీ!

Cab Driver : ప్రస్తుత రోజుల్లో ఎక్కడికైనా వెళ్లాలి అనుకుంటే సొంత వాహనాలే ఉండాల్సిన పని లేదు. నిమిషాల్లో ఆన్ లైన్‌ బుకింగ్(Online Booking) చేసుకుంటే... క్షణాల్లో గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇలాంటి సేవలను అందించడానికి ఓలా, ర్యాపిడో(Rapido), ఉబర్‌ వంటి సంస్థలు ముఖ్యమైనవి. ఇలాంటి సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణం కూడా చాలా సులువైపోయింది. దీంతో రోజురోజుకి ఆ సంస్థల సేవలకు ఫుల్‌ డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన కొంతమంది క్యాబ్ డ్రైవర్లు వినియోగదారులను మోసం చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఘటననే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఉబర్ క్యాబ్ డ్రైవర్ .. ఓ ప్రయాణికుడి నుంచి అసలు ఛార్జ్ కంటే.. అధికంగా రూ. 27 లను వసూల్ చేశాడు.దీంతో ప్రముఖ క్యాబ్ సర్వీస్ సంస్థ ఉబర్‌ ఇండియా(Uber India) ఏకంగా ఆ వ్యక్తికి రూ. 28 వేలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌(Punjab) కు చెందిన రిత్విక్‌గార్గ్‌.. 2022 సెప్టెంబరు 19న ఉబెర్ యాప్ ద్వారా చండీగఢ్‌లోని సెక్టార్ -21 నుండి సెక్టార్ -13 మణిమజ్రాకు క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. ఆ సమయంలో యాప్‌లో 7.82 కిలోమీటర్ల ప్రయాణానికి గానూ రూ.53 చార్జ్ చేస్తున్నట్టు చూపించింది. మణిమజ్ర వద్దకు రాగానే డ్రైవర్ కైలాష్ అతడి నుంచి రూ.80 ఛార్జీ వసూలు చేశాడు.

ఈ విషయం గురించి రిత్విక్‌ కంపెనీకి ఫిర్యాదు చేయడంతో పాటు చాలా సార్లు మెయిల్స్ ద్వారా ఉబర్ ఇండియా దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ కూడా కంపెనీ సరిగా పట్టించుకోలేదు. దీంతో కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపించాడు. అయినా కంపెనీ నిర్లక్ష్యంగానే వ్యవహరించింది. మేము కేవలం సర్వీస్‌ మాత్రమే ఇస్తామని డ్రైవర్లకు మాకు సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చింది.

డ్రైవర్‌పై చర్య తీసుకోవడానికి ఉబెర్ ఇండియా ఎటువంటి దర్యాప్తు నివేదికను నమోదు చేయలేదని కమిషన్ తెలిపింది. దీంతో రిత్విక్‌ గార్గ్‌ చండీగఢ్‌లోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆశ్రయించారు. ఉబర్‌ ఇండియా సమాధానంపై కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తంచేసింది.

సంబంధిత డ్రైవర్‌పై చర్య తీసుకోవడానికి Uber ఇండియా యాప్ ఎటువంటి దర్యాప్తు నివేదికను నమోదు చేయలేదని కమిషన్ తెలిపింది. కస్టమర్‌ చెల్లించే డబ్బుల్లో ఉబర్ కూడా నగదు తీసుకుంటున్న క్రమంలో కచ్చితంగా ఈ వ్యవహారం గురించి ఉబర్ బాధ్యత తీసుకోవాల్సిందే అని కమిషన్ తేల్చి చెప్పింది.

ఈ క్రమంలోనే వినియోగదారుని వద్ద నుంచి అదనంగా తీసుకున్న రూ. 27తో పాటు ఫిర్యాదుదారు రిత్విక్‌ గార్గ్‌ కు రూ. 5 వేల పరిహారం, 3 వేలు ఖర్చులు కింద చెల్లించాలని ఉబర్‌ ఇండియాను కమిషన్ ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి తప్పిదాలను జరగకుండా చూడాలని కమిషన్‌ లీగ్‌ ఎయిడ్‌ ఖాతాలో రూ. 20 వేలు జమ చేయాలని ఆదేశించింది.

Also read: 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి… 26 వేల మంది ఉద్యోగులు ఔట్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

HariHaraVeeraMallu Release: వీరమల్లు విడుదల డౌటే..? పవన్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ 'హరిహర వీరమల్లు' మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. మే 9న విడుదల కానుండగా.. ఇంకా షూటింగ్ పనులు పెండింగ్ ఉన్నట్లుగా సమాచారం. పవన్ ఆరోగ్యం, అలాగే కొడుకుకు ప్రమాదం జరగడం ఆలస్యానికి కారణమని టాక్.

New Update

HariHaraVeeraMallu Release:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన  'హరిహర వీరమల్లు' మళ్ళీ పోస్ట్ ఫోన్ కానున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ళ క్రితం మొదలు పెట్టిన ఈ సినిమాకు ఇంకా థియేటర్ మోక్షం కలగడం లేదు. మే 9న మూవీని విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించగా.. షూటింగ్ పనులు ఇంకా పెండింగ్ ఉండడంతో మళ్ళీ వాయిదా వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ అనారోగ్యం, ఆయన కొడుకు అగ్ని ప్రమాదానికి గురవడం వంటి వ్యక్తిగత ఇబ్బందులతో షూటింగ్ ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరికొంతమంది.. ఇప్పుడు రిలీజ్ కాకపోతే..? ఇకపై  'హరిహరవీరమల్లు' రిలీజ్ డౌటే? అని కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. 'హిట్ 3' ట్రైలర్ ట్రెండింగ్ .. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!

ఇప్పటికే మూడు సార్లు

మొదటగా 2021లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేయగా.. కరోనా కారణంగా  చేత 2022 మార్చి 28కి పోస్ట్ ఫోన్ చేశారు. ఆ తర్వాత  2023, 2024లో పవన్ రాజకీయాలతో బిజీ అయిపోవడంతో 2025 మార్చి 28కి రిలీజ్ వాయిదా వేశారు. అయితే అప్పటికి కూడా ఈ సినిమా చూసే భాగ్యం దక్కలేదు పవన్ ఫ్యాన్స్ కి. మళ్ళీ మే 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.  కానీ ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. 

cinema-news | latest-news | harihara-veeramallu-movie

Also Read: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

Advertisment
Advertisment
Advertisment