తిరుమలలో చిరుతల కలకలం.. ఉలిక్కిపడ్డ భక్తులు

తిరుమలలో భక్తులకు రెండు చిరుతలు కనిపించాయి. దీంతో వారు కేకలు వేయడంతో అవి సమీప అడవిలోకి పారిపోయినట్లు తెలుస్తోంది. దీంతో భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

New Update
తిరుమలలో చిరుతల కలకలం.. ఉలిక్కిపడ్డ భక్తులు

తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అలిపిరి నడకదారిలో ఆఖరి మెట్టు దగ్గర రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు ఉలిక్కిపడ్డారు. చిరుతలను చూసి భక్తులు గట్టిగా కేకలు వేశారు. భక్తుల కేకలతో అడవిలోకి చిరుతలు పారిపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు