Canada Prime Minister: ఎట్టకేలకు భారత్‌ ని వీడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో!

సుమారు 36 గంటల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కెనడా ప్రధాని(Canada prime minister)  జస్టిన్ ట్రూడో (Justin trudo) భారత్(Bharat)  ని విడిచి స్వదేశం బయల్దేరారు.

New Update
Canada Prime Minister: ఎట్టకేలకు భారత్‌ ని వీడిన కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో!

Justin Trudeau: సుమారు 36 గంటల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు కెనడా ప్రధాని(Canada Prime Minister)  జస్టిన్ ట్రూడో (Justin Trudeau) భారత్ ని విడిచి స్వదేశం బయల్దేరారు. జీ 20 సమావేశాలకు (G20 Meeting) వచ్చిన ఆయన సమావేశాల తరువాత కెనడా బయల్దేరి వెళ్లే సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆయన సుమారు 36 గంటల పాటు భారత్ లోనే చిక్కుకుపోయారు.

జీ 20 సదస్సు (G20 Summit) లో పాల్గొనేందుకు తన కుమారుడు జేవియర్ తో కలిసి సెప్టెంబర్ 8న ట్రూడో ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఆయన ప్రయాణిస్తున్న అధికారిక విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అతను తన దేశానికి వెళ్లలేకపోయారు. వార్తా సంస్థ ANI ప్రకారం, విమానం మరమ్మతులు చేసే వరకు కెనడా ప్రతినిధి బృందం భారతదేశంలోనే ఉంటుంది. సమాచారం ప్రకారం, ప్రధాని తన హోటల్ నుండి విమానాశ్రయానికి బయలుదేరబోతున్నప్పుడు, తన విమానం కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నట్లు సమాచారం.

సుమారు 36 గంటలు కష్టపడిన నిపుణుల బృందం ఆయన విమానాన్ని ప్రయాణించడానికి అనుకూలంగా చేశారు. మ‌రోవైపు కెన‌డా నుంచి ట్రూడో కోసం బ‌య‌లుదేరిన బ్యాక‌ప్ విమానాన్ని లండ‌న్‌కు దారిమ‌ళ్లించారు. అయితే ఈ విమానాన్ని ఎందుకు వెనక్కి తిప్పారు అనే విషయం గురించి మాత్రం ఎవరూ వెల్లడించలేదు.

అంతకుముందు జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్, కెనడాలో ఖలిస్తానీ కార్యకలాపాలు పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ద్వైపాక్షిక చర్చల సందర్భంగా, ఇరు దేశాల్లో పెరుగుతున్న ఖలిస్తానీ మద్దతుదారులు, భారతదేశానికి వ్యతిరేకంగా వారి కుట్ర గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఖలిస్తానీ కార్యకలాపాలను ఆపివేయాలని, భారతదేశానికి వ్యతిరేకంగా నిరసనలను ఆపాలని భారతదేశం బ్రిటిష్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోలను కూడా డిమాండ్ చేసింది.

ఈ అంశాన్ని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ సీరియస్‌గా తీసుకున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ప్రధాని మోడీ మాటలు విన్నారు. అయితే ఈ విషయంలో ఆయన డిఫెన్స్‌గా కనిపించారు. ఖలిస్తానీలపై కఠిన చర్యలు తీసుకుంటామని రిషి సునక్ భారత్‌కు హామీ ఇచ్చారు.

Also Read: ప్రత్యేక రైల్లో రష్యా చేరుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు