Rajadani Express: ఐదు నిమిషాలు...అర కిలోమీటరు..రాజధాని ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన పెనుప్రమాదం!

పట్టాల పై వెల్డింగ్‌ లోపాన్ని గుర్తించిన మహదేవ అనే ట్రాక్ మ్యాన్‌ చూపిన తెగువ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు పెట్టి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేశాడు.

New Update
Railway : వేసవి సెలవులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వేశాఖ

Rajadani Express: విధి నిర్వహణలో భాగంగా ఓ ట్రాక్‌ మ్యాన్‌ చూపించిన తెగువ, సమయస్ఫూర్తి...ఓ రైలుకు పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. పట్టాలపై వెల్డింగ్‌ లోపాన్ని గుర్తించిన ట్రాక్‌మ్యాన్‌ అదే మార్గంలో వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ను ఆపేందుకు పట్టాల వెంట ఐదు నిమిషాల్లో అర కిలోమీటరు మేర పరుగులు తీయడం గమనార్హం. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..మహాదేవ అనే ట్రాక్‌ మ్యాన్‌ తన విధుల్లో భాగంగా కొంకణ్‌ రైల్వే డివిజన్‌ లోని కుమ్టా, హొన్నావర్‌ స్టేషన్‌ ల మధ్య తనిఖీలు చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే తెల్లవారుజామున 4.50 గంటల ప్రాంతంలో ఓ చోట పట్టాల జాయింట్‌ వద్ద వెల్డింగ్‌ అసంపూర్తిగా ఉన్నట్లు గుర్తించాడు. అప్పటికే ఆ మార్గంలో తిరువనంతపురం-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వస్తోంది.

దీంతో వెంటనే అప్రమత్తమైన అతడు...కుమ్టా స్టేషన్‌ కు సమాచారం అందించాడు. అయితే..అప్పటికే రైలు ఆ స్టేషన్‌ ను దాటేసింది. దీంతో నేరుగా లోకో పైలట్‌ ను సంప్రదించేందుకు యత్నించాడు. అది విఫలమైంది. దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా..రైలును ఆపేందుకు పట్టాల వెంట పరుగులు పెట్టాడు. ఐదు నిమిషాల్లో అర కిలోమీటర్‌ మేర పరిగెత్తి...లోకో పైలట్‌ కు సిగ్నల్‌ అందించి..సకాలంలో రైలును నిలిపివేయించారు.

వెల్డింగ్‌ పని పూర్తయిన అనంతరం ..రైలు తిరిగి గమ్య స్థానానికి బయల్దేరింది. వందలాది ప్రయాణికుల భద్రత కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహాదేవను ఉన్నతాధికారులు కొనియాడుతున్నారు. అతడిని సత్కరించి ..రూ . 15 వేల నగదు బహుమతిని అందించారు.

Also Read: గోల్డ్ లవర్స్ కి బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన మహిళా యూట్యూబర్‌.. మృతదేహాన్ని కాల్వలో పడేసి..

హర్యానాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అనంతరం నిందితులు మృతదేహాన్ని కాల్వలో పడేశారు. చివరికీ పోలీసుల మహిళా యూట్యూబర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
Haryana YouTuber Strangles Husband with Lover

Haryana YouTuber Strangles Husband with Lover

ఈ మధ్య భార్యాభర్తల మధ్య హత్యలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం లేదా ప్రియురాలి కోసం భార్యను చంపేయడం లాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా యూట్యూబర్‌ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని భివానీలో యూట్యూబర్ రవీనా, ప్రవీణ్ దంపతులు ఉంటున్నారు. 

Also Read: మరో భయంకరమైన భార్య మర్డర్.. ఛార్జర్ వైర్‌తో గొంతు కోసి, పిల్లలను గదిలో బంధించి!

2017లో వీళ్లకు పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం రవీనాకు ఇన్‌స్టా్గ్రామ్‌లో ప్రేమ్‌నగర్‌కు చెందిన మరో యూట్యూబర్‌ సురేశ్‌తో పరిచయం ఏర్పడింది. చివరికి అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే మార్చి 25 వాళ్లిద్దరిని అభ్యంతరకర పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రవీణ్‌ చూశాడు. దీంతో అతడు నిలదీయగా.. వాళ్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే రవీనా, సురేశ్‌.. ప్రవీణ్‌ గొంతుకోసి హత్య చేశారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2.30 గంటలకు వారు ఆ మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లి కాలువలో పడేశారు. ప్రవీణ్‌ ఎక్కడున్నాడని అతడి కుటంబ సభ్యులు అడిగినా కూడా రవీనా తనకేమి తెలియదని చెప్పింది.  

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

చివరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల తర్వాత వాళ్లకి కాల్వలో ప్రవీణ్ మృతదేహం దొరికింది. దీంతో ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలించగా.. రవీనా బండారం బయటపడింది. అధికారులు తమదైన శైలిలో విచారించగా.. నేరం చేసినట్లు రవీనా ఒప్పుకుంది. దీంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అలాగే యూట్యూబర్ సురేశ్ కోసం గాలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరం ఉన్నాకూడా రవీనా సోషల్ మీడియాలో వీడియోలు చేసేదని విచారణలో తేలింది. అంతేకాదు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తేలింది. 

 

Advertisment
Advertisment
Advertisment