Jagga Reddy: కాంగ్రెస్ కూలిపోతోందని ఇందుకే అంటున్నారు.. విజయసాయి రెడ్డి బ్రోకర్ దుకాణం పెట్టుకున్నవా?: జగ్గారెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది త్వరలో కాంగ్రేస్ లో చేరతారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేవలం తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే 6 నెలల్లో కాంగ్రెస్ కూలిపోతోందని కేటీఆర్, హరీష్ అంటున్నారన్నారు.

New Update
Jagga Reddy: కాంగ్రెస్ కూలిపోతోందని ఇందుకే అంటున్నారు.. విజయసాయి రెడ్డి బ్రోకర్ దుకాణం పెట్టుకున్నవా?: జగ్గారెడ్డి

Jagga Reddy Fired on KTR and Harish Rao: బీఆర్ఎస్ కు వారి ఎమ్మెల్యేలు చేజారిపోతారని భయం పట్టుకుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. త్వరలోనే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రేస్ లో చేరతారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ కూలిపోతోంది అని కేటీఆర్ (KTR)..హరీష్ రావు (Harish Rao) అంటున్నారన్నారు. పార్టీని కాపాడుకోవాలనే అలా కామెంట్స్ చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయ సందిగ్ధంలో ఉందన్నారు జగ్గారెడ్డి.

Also Read: జనసేన నేత హత్యాయత్నం కేసులో ఊహించని ట్విస్ట్..!

ఈ క్రమంలోనే విజయసాయి రెడ్డిపై (Vijayasai Reddy) నిప్పులు చెరిగారు. బ్రోకర్ దుకాణం ఏదైనా పెట్టుకున్నవా? విజయసాయి రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నికేమైనా విలువలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కాళ్ళును విజయసాయి రెడ్డి మొక్కాడని అన్నారు. కేసీఆర్ (KCR) ని అదరగొట్టిన వ్యక్తి వైఎస్ అని.. అలాంటి వైఎస్ కొడుకు ఆత్మ విజయసాయిరెడ్డి ..కేసీఆర్ కాళ్ళు మొక్కుడు ఏంటని తనకే సిగ్గగా అనిపించిందన్నారు. మోడీ డైరెక్షన్ లోనే..కేసీఆర్.. జగన్ పనిచేస్తున్నారని విమర్శలు గుప్పించారు.


Also Read: మేకపాటికి చేదు అనుభవం.. రసభసగా గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం..!

ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. 12 నుండి 14 ఎంపీ సీట్లు గెలవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మీడియేటర్ విజయ సాయి రెడ్డి..కేటీఆర్..హరీష్ కుట్రలు తిప్పి కొడతామన్నారు. వీలైనంత త్వరలోనే 20 మంది ఎమ్మెల్యే లను కాంగ్రెస్ లోకి (Congress) తెస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆట మొదలైంది.. చూసుకోండి అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ 15 లక్షలు పెంచారని..రూ. 500 కె సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీల నిర్ణయం మేరకు పథకాల అమలవుతున్నయన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

ఐపీఎల్ 2025లో ఈరోజు అద్భుతమైన మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ ఉప్పల్ లో ఈరోజు పంజాబ్ కింగ్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 246 పరుగుల టార్గెట్ ఇస్తే దాన్ని ఎనిమిది వికెట్ల తేడాతో ఛేదించింది. 

author-image
By Manogna alamuru
New Update
ipl

SRK VS PBKS

హైదరాబాద్ సన్ రైజర్స్ అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చింది. ఐదు మ్యాచ్ లు ఓడిపోయిన తర్వాత ఈరోజు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ చితక్కొట్టేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లు విజృంభించి ఆడేశారు. పజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ టార్గెట్ ను 8 వికెట్ల తేడాతో సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ వర్మ 141 పరుగులు, ట్రావిస్ హెడ్ 66 పరుగులతో ఇరగదీసారు. ఇద్దరూ కలిసి మ్యాచ్ ను గెలిపించేశారు. 150 పరుగుల ముందు అభిషేక్ వర్మ వికెట్ కోల్పోవడం కొంత నిరాశ కలిగించినా...అతను ఈరోజు ఆడిన తీరుతో ఉప్పల్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించాడు. అభిషేక్‌ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్‌లsy 141 పరుగులు చేసి పంజాబ్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ మైదానంలో పరుగుల వరద పారించాడు. అభిషేక్ ధాటికి పంజాబ్ ఏకంగా ఎనిమిది మందితో బౌలింగ్‌ చేయించింది.  మరోవైపు అతను కొట్టిన బంతులను గ్రౌండ్ స్టాఫ్ వెతుక్కోవడంతోనే సరిపోయింది.  ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 66 పరుగులు చేసి అభిషేక్ కు మంచి సపోర్ట్ ఇచ్చాడు.  చివర్లో క్లాసెన్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌ తో 21, ఇషాన్ కిషన్ 9*; 6 బంతుల్లో 1 సిక్స్ కొట్టి మ్యాచ్ ను గెలిపించారు. 

పంజాబ్ కూడా దుమ్మ రేపింది..

అంతకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెలరేగిపోయింది. తొలి ఇన్నింగ్స్ చేసి కింగ్స్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది. దీంతో SRH ముందు 246 భారీ టార్గెట్ ఉంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఈ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్‌గా క్రీజులోకి ప్రభ్‌మన్ సింగ్‌, ప్రియాంశ్‌ ఆర్య మొదటి నుంచి దంచి కొట్టారు. బాల్‌ టు బాల్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశారు. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పెట్టించారు. సన్ రైజర్స్ జట్టు బౌలర్లకు చెమటలు తెప్పించారు. ఇక హర్షల్‌ పటేల్‌ బౌలింగ్‌లో (3.6) ప్రియాంశ్‌ ఆర్య (36) నితీశ్‌ రెడ్డికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన శ్రేయస్ అయ్యార్ దుమ్ము దులిపేశాడు. పరుగులు రాబడుతూ అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో కెవ్ కేక అనిపించాడు. అతడు 36 బంతుల్లో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే వధేరా 22 బంతుల్లో 27 పరుగులు, శశాంక్ సింగ్ 3 బంతుల్లో 2 పరుగులు, మాక్స్‌వెల్ 7 బంతుల్లో 3 పరుగులు, స్టొయినీస్ 11 బంతుల్లో 34 పరుగులు చేశారు. 

 today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-pbks

Also Read:  USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

Advertisment
Advertisment
Advertisment