Maharashtra : రాయ్‌గఢ్‌ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్ ఫోర్ట్‌ను సైతం వరదనీరు చుట్టుముట్టింది.ఫోర్ట్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.

New Update
Maharashtra : రాయ్‌గఢ్‌ ఫోర్ట్‌ను ముంచెత్తిన వరద.. చిక్కుకున్న పర్యాటకులు

Tourists Stuck In Raigad Fort Due To Heavy Rain : మహారాష్ట్ర (Maharashtra) ను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం భారీ వర్షం పడుతుంది. ఏకంగా రికార్డు స్థాయిలో ఏడు గంటల్లో 300 మిల్లీమీటర్ల వర్షంపాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. పలుప్రాంతాల్లో కార్లు, మోటారు సైకిళ్లు నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం రాయ్‌గఢ్ ఫోర్ట్‌ (Raigad Fort) ను సైతం వరదనీరు చుట్టుముట్టింది. ఆదివారం సెలవు కావడంతో ఫోర్ట్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వాతావరణం చల్లబడటంతో ఫోర్ట్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఫోర్ట్‌ సందర్శనకు వచ్చారు.. మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల మధ్యలో అక్కడ భారీ వర్షం కురిసింది. ఫోర్ట్‌ ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికిపైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు.

వారంతా ఎటూ వెళ్లలేని పరిస్థితి. సాయం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. ఇందుకు సంబంధించిన భయానక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కొండలపై నుంచి ఉద్ధృతంగా కిందకు జారుతున్న జలపాతాన్ని పోలిన నీటి ప్రవాహం మధ్య పర్యాటకులు (Tourists) రెయిలింగ్‌లు, మెట్లను పట్టకుని వేలాడుతూ కనిపించారు.

Also read: సెంచరీకి చేరువలో టమాటా..ఇక ఏం కొనాలో..ఏం తినాలో!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Musk-Trump: ఆయనో మూర్ఖుడు..ట్రంప్‌ సలహాదారుడి పై మస్క్‌ సంచలన వ్యాఖ్యలు!

మస్క్‌...ట్రంప్‌ వాణిజ్య సలహాదారుడు పీటర్‌ నవారో పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.నవారో మస్క్‌ కార్ల కంపెనీ పై తీవ్ర విమర్శలు చేశారు.దీని పై ఎలాన్‌ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు.

New Update
musk

musk

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల పై ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టారిఫ్‌ ల పై ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేసిన మస్క్‌...ట్రంప్‌ వాణిజ్య సలహాదారుడు పీటర్‌ నవారో పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనో మూర్ఖుడంటూ మండిపడ్డారు.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

వైట్‌ హౌస్‌ సీనియర్‌ అడ్వైజర్‌ పీటర్‌ నవారో మీడియాతో మాట్లాడుతూ..మస్క్‌ కార్ల కంపెనీ పై తీవ్ర విమర్శలు చేశారు.అది కార్ల తయారీ కంపెనీ కాదని, కేవలం కూర్పు చేసేదంటూ ఆరోపించారు.  బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌,టైర్లు వంటి విడిభాగాలను జపాన్‌,చైనా నుంచి తీసుకువచ్చి..కేవలం అసెంబ్లింగ్‌ చేస్తారని అన్నారు.

Also Read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

చౌకగా లభించే విదేశీ విడిభాగాలే ఆయనకు కావాలని నవారో పేర్కొన్నారు. దీని పై ఎలాన్‌ మస్క్ తీవ్రంగా మండిపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా  స్పందిస్తూ..నవారో మూర్ఖుడు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాలో తయారయ్యే కార్లలో టెస్లాదే అగ్రభాగమని చెప్పారు. అంతకుముందు ట్రంప్ టారిఫ్‌ విధానం పై మస్క్‌ అసంతృప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.

చైనా టారిఫ్‌ లపై వెనక్కి తగ్గాలని అధ్యక్షుడికి సూచించారని, అయితే ఆ చర్చలు విఫలమైనట్లు తెలిసింది. ఈ క్రమంలోనే తాజాగా ట్రంప్‌ వాణిజ్య సలహాదారుడి పై డోజ్‌ సారథి ఘాటు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 

Also Read: Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి

Also Read: TG Crime: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!

white-house | doze | tesla | america | trump | eleon-musk | musk | peter navaro | trade-advisor | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment