Women's Day 2024: మహిళల ఆరోగ్యానికి ఈ పోషకాలు తప్పనిసరి అవసరం..!

నేటికాలం మహిళలు ఇంటిపనులు, ఉద్యోగం, పిల్లలు, కుటుంబ బాధ్యతలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ముఖ్యంగా మూడు పదుల వయస్సు దాటిన మహిళలు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు తీసుకోవల్సిన పోషకాహారాలు ఏవో చూద్దాం.

New Update
Women's Day 2024: మహిళల ఆరోగ్యానికి ఈ పోషకాలు తప్పనిసరి  అవసరం..!

Women's Day 2024: బిజీ వర్క్ తదితర కారణాల వల్ల మహిళలు తరచుగా తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించరు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించడం మంచిది. వివిధ వయసుల స్త్రీలకు వివిధ పోషకాలు అవసరం. మ‌హిళ‌ల ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన కొన్ని పోషకాల గురించి తెలుసుకుందాం.

ఐరన్:
ఈ జాబితాలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. రక్తహీనత అనేది శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోయే పరిస్థితి. 30 ఏళ్లు దాటిన చాలా మంది మహిళల్లో రక్తహీనత వస్తుంది. శరీరానికి సరిపడా ఎర్ర రక్త కణాలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో సహాయపడే ప్రోటీన్. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ అవసరం. కాబట్టి మీ ఆహారంలో మాంసం, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలికూర, బ్రోకలీ, బీట్‌రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోండి.

విటమిన్ ఎ:
ఈ జాబితాలో విటమిన్ ఎ రెండవ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. కాబట్టి మీ ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి.

విటమిన్ బి12:

విటమిన్ B12. ఇది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది, రక్తహీనతను నివారిస్తుంది. మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కాల్షియం:
కాల్షియం నాల్గవ స్థానంలో ఉంది. మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, వారు తరచుగా ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.

విటమిన్ డి:

ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది.

మెగ్నీషియం:
కండరాల బలం, ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. కాబట్టి మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం.

ఇది కూడా చదవండి: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు:విద్యాశాఖ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Official బిగ్ బ్రేకింగ్: యూపీలో అఘోరీ అరెస్ట్

లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి  తీసుకున్నారు.

New Update
V BREAKING

లేడీ అఘోరీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాసును మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. నగ్న పూజలు పేరుతో మహిళ నుండి రూ.10 లక్షలు వసూలు చేసిన కేేసులో శ్రీనివాస్‌ను అదుపులోకి  తీసుకున్నారు. లేడీ అఘోరీతోపాటు అతన్ని పెళ్లి చేసుకున్న శ్రీవర్షణిని కూడా హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో వారిని మోకిలా పోలీసులు పట్టుకున్నారు.

Also read: మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ లేడీ అఘోరీ శివ విష్ణు బ్రహ్మ అట్టూరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని అఘోరీ మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది.

Also read: New Pope: కొత్త పోప్ ఎన్నికలో కీలకంగా నలుగురు ఇండియన్ కార్డినల్స్

శుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని లేడీ అఘోరీ డిమాండ్ చేసింది. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

( Uttar Pradesh | aghori | lady aghori arrest | arrest | Mokila | aghori sri varshini | Aghori Sri Varshini)

 

Advertisment
Advertisment
Advertisment