ఆమెకు 47..అతనికి 76 ..ఎనిమిదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు..!

ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో రామచంద్ర సాహు (76) అనే వృద్ధుడికి పెళ్లైంది. ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. భార్య మరణించింది. 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ కులాగర్‌ గ్రామానికి చెందిన త్రినాథ్‌ సాహు కుమార్తె సురేఖ (46) ను ఒకసారి చూశాడు. తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలకున్నాడు. జులై 19న భంజ్‌నగర్‌ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఈ ఎనిమిదేళ్లు ఫోన్లలోనే ప్రేమకథ నడిచింది.

New Update
ఆమెకు 47..అతనికి 76 ..ఎనిమిదేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు..!

ఇద్దరి కూతుళ్లకు పెళ్లి చేసాడు. భార్య మరణించింది.తనతో ఇప్పుడు ఎవరూ లేరు,తనకోసం ఎవరూ రారు.18 యేండ్లు క్షణమొక యుగంలా గడిచిపోయింది. ఇప్పుడు ఆ పెద్దాయనకు 76 యేండ్లు. ఒంటరి జీవితం..ఏకా మరణం నడునంతా నాటకం. ఇంతేనా జీవితం అనుకున్నాడు.!

publive-image

ఆయువుంది,ప్రాణముంది,నెత్తురుంది సత్తువుంది. సెకెండ్ ఇన్నింగ్స్ ఇంత సీరియస్ గా ఉండకూడదు అనుకున్నారు.కాడు రమ్మనే దాకా కావలసిని సమయం ఉందనుకున్నాడు. ఖాళీగా ఉండడం ఎందుకనుకున్నాడు.

అప్పుడే సురేఖ అతని కంటపడింది.పడిపోయాడు. కాళ్లుతన్నుకుని కాదండోయ్! ప్రేమతన్నుకొచ్చి తొలిచూపులోనే పడిపోయాడు. ఎనిమిదేళ్లు ఆమెను పిచ్చిగా ప్రేమించాడు. ఆమె కోసం కలలు కన్నాడు. పెంళ్లంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాడు.

చివరకు సాధించాడు. ఆమె పెద్దలతో మాట్లాడి అర్హత సాధించాడు. ఇంతకీ ఆమె వయసు చెప్పలేదు కదూ జస్ట్ 47 యేండ్లంతే..! ఎనిమిదేళ్ల ప్రేమకు ఇప్పుడు శుభం కార్డు పడింది.శుభలేఖగా మారింది. ఇప్పుడు వాళ్లు దంపతులు..

యువకులకు ఏమాంత్రం తీసిపోని దంపతులు. మిగిలిన జీవితాన్ని ఒకరికొకరుగా పండించుకునేందుకు తోడూనీడగా నిలచే దంపతులు. ఇప్పుడీ ఈ జంట నెట్టింట ట్రెండ్ వైరల్ అయ్యింది.

ఈ వింత వెడ్డింగ్ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన రామచంద్ర సాహు (76) అనే వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితం వివాహమైంది.

తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. ఈ క్రమంలో భార్య మరణించింది. దీంతో దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. అయితే.. దాని కోసం ప్రయత్నాలు మొదులుపెట్టిన క్రమంలో.. ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ కులాగర్‌ గ్రామానికి చెందిన త్రినాథ్‌ సాహు కుమార్తె సురేఖ (46) ను ఒకసారి చూశాడు.

అయితే, అలా చూసిన తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డానని.. పెళ్లిచేసుకుంటానని రామచంద్ర చెప్పిన మాటలకు సురేఖ కూడా అంగీకరించింది. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీశారు.

చివరకు జులై 19న భంజ్‌నగర్‌ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో ఆచారాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో తమ ప్రేమ పెళ్లిని అడ్డుకోకుండా.. కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ఆలోచించాలని ఇద్దరూ పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pakistani Colony: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఆంధ్రప్రదేశ్‌లోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ ఉందని మీలో ఎంతమందికి తెలుసు. 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారు. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు.

author-image
By Seetha Ram
New Update
Pahalgam Terror Attack (4)

Pahalgam Terror Attack

పాకిస్తాన్.. ఈ పేరు వింటే చాలా మంది భారతీయులు కట్టలు తెంచుకుంటారు. అయితే మరి అలాంటి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ కాలనీ ఉందని మీకు తెలుసా?. అవును మీరు విన్నది నిజమే. ఏపీలోని బెజవాడలో పాకిస్తాన్ కాలనీ అనే ప్రాంతం ఉంది. అక్కడ ఎంతో మంది జీవిస్తున్నారు కూడా. అది విజయవాడ సిటీ కార్పొరేషన్‌ పరిధిలోని 62వ డివిజన్‌లో ఉంది. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

అక్కడ ఉండే ప్రజల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్స్ సహా అన్నింటిలోనూ వారి అడ్రస్ పాకిస్తాన్ కాలనీ, బెజవాడగా ఉంటుంది. అయితే మరి ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది?.. అక్కడ పాకిస్తానీలు జీవిస్తున్నారా?, ఒకవేళ వారు జీవించకపోతే అక్కడునున్న వారు ఈ పేరు వల్ల ఇబ్బందులు ఏమైనా పడుతున్నారా? లేదా? అనేది పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థులు

అప్పట్లో 1980లో పాకిస్తాన్ నుంచి వచ్చిన శరణార్థుల కోసం విజయవాడలో పాకిస్తాన్ కాలనీ ఏర్పాటు చేశారని.. వారంతా పాకిస్థానీలే కాబట్టి దానికి పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారని ఆ ప్రాంత కార్పొరేటర్‌గా గతంలో పనిచేసిన ఓ వ్యక్తి తెలిపారు. అంతేకాకుండా అక్కడ బర్మా కాలనీ కూడా ఉందని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్ కాలనీలో నివశిస్తున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ.. అక్కడ పాకిస్తాన్ వాళ్ల కోసం ఆ కాలనీ కట్టారని.. వాళ్లు బట్టల వ్యాపారం చేసేవారని.. అయితే అమ్మకాలు సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని తెలిపారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

ఎక్కడ నుంచి వచ్చారంటే?

1971లో తూర్పు పాకిస్తాన్ (ఈస్ట్ బెంగాల్), పాకిస్తాన్‌ మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అప్పట్లో భారత్.. ఈస్ట్ బెంగాల్ తరపున పోరాడింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రాంతం బంగ్లాదేశ్‌గా ఏర్పడింది. ఆ సమయంలోనే ఎన్నో లక్షల మంది శరణార్థులు తూర్పు పాకిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చారు. వారికి ఆశ్రయం ఇచ్చి, శిబిరాలు ఏర్పాటు చేసింది భారత్. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

అయితే ఇప్పుడు మాత్రం ఆ పాకిస్తానీ కాలనీ ప్రాంతంలో శరణార్థులు ఎవరూ లేరని స్థానిక ప్రజలు చెబుతున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు కొద్ది రోజులు మాత్రమే ఉన్నారని.. ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయారని తెలిపారు. అయితే అప్పట్లో బెజవాడకు ఈ ప్రాంతం చాలా శివారులో ఉండేది. అంతేకాకుండా కరెంటు సరిగా ఉండేది కాదు, రోడ్లు ఉండేవి కావు, ఇళ్లు కూడా సరిగా లేకపోవడం ఒక కారణం. అలాగే బుడమేరుకి అప్పట్లో భారీ వరద రావడంతో ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయింది. దీంతో వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. 

పాకిస్తాన్ కాలనీ వల్ల ఇబ్బందులు

ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు.. పాకిస్తాన్ కాలనీ పేరు వల్ల చాలా ఇబ్బందుల పడుతున్నామని చెబుతున్నారు. కొందరు పీజీలు పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలనుకుంటే పాస్ పోర్ట్ ఆఫీసులో పాకిస్తాన్ కాలనీ పేరు చూసి చాలా ప్రశ్నలు అడుగుతున్నట్లు ఆ ప్రాంత యువత చెబుతుంది. అలాగే ఉద్యోగాల కోసం వెళ్లినపుడు కూడా ఇంటర్వ్యూలలో ఆ పేరు వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. 

పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

ఆ కాలనీ ప్రజల సమస్యను ఏపీ ప్రభుత్వం పరిష్కరించింది. ఈ మేరకు ఆ కాలనీకి మరో పేరును పెట్టింది. భగీరథ కాలనీగా కొత్త పేరును నామకరణం చేసింది. అదే సమయంలో స్థానికుల చిరునామాను (అడ్రస్) మార్చినట్లు జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రకటించారు. దీంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. 

Pahalgam attack | pahalgam terror attack | pahalgam terrorist attack | vijayawada viral-news | pakistan | india-and-pakistan

Advertisment
Advertisment
Advertisment