Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి 

మకర సంక్రాంతి పండగ మనం ఎంతో ఘనంగా జరుపుకుంటాం. అయితే, ఇది మన దేశంలోనే కాదు మరి కొన్ని దేశాల్లోనూ పెద్ద పండగే. మన పొరుగున ఉండే శ్రీలంక, మయన్మార్, థాయ్ లాండ్ దేశాల్లో సంక్రాంతి వేడుక ఉంటుంది. అయితే, మనకంటే కొంచెం భిన్నంగా పండగ చేసుకుంటారు అక్కడ. 

New Update
Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి 

Makara Sankranti: ఈ సంవత్సరం ఉత్తరాయణ పండుగ అంటే మకర సంక్రాంతిని  జనవరి 15న (January 15) దేశమంతా వేడుకగా జరుపుకోవడానికి సిద్ధం అయిపోయింది.  ఈ రోజున సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. భారతదేశమంతటా ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో జరుపుకుంటారు. మకర సంక్రాంతికి స్నానం..  దానధర్మాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి గంగానదిలో స్నానాలు చేస్తుంటారు.

కానీ ఈ ఉత్తరాయణ పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా జరుపుకుంటారు. అవును, ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ, మన  పొరుగు దేశాలలో కూడా జరుపుకునే ఈ పండుగ భారతదేశంలో కొత్త సీజన్ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. మకర సంక్రాంతి పండుగను ఏయే దేశాల్లో జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీలంక (Sri Lanka)
శ్రీలంక భారతదేశానికి దక్షిణాన ఉంది.  అయితే ఇక్కడ కూడా మకర సంక్రాంతి (Makara Sankranti) ని జరుపుకుంటారు. ఇక్కడ ఈ పండుగను జరుపుకోవడానికి భిన్నమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. శ్రీలంకలో మకర సంక్రాంతిని ఉజాహవర్ తిరనాల్ అంటారు. ఇక్కడ కొందరు దీనిని పొంగల్ (Pongal) అని కూడా అంటారు. దీనికి కారణం ఇక్కడ తమిళనాడుకు చెందిన వారు అధిక సంఖ్యలో నివసించడమే.

Also Read: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో మొదటి జిమ్ ఎక్కడంటే.. 

మయన్మార్ (Myanmar)
మయన్మార్‌లో ఈ పండుగ ను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక్కడ తినాగ్యాన్ (Thingyan) పేరుతో జరుపుకుంటారు. మయన్మార్‌లోని మకర సంక్రాంతి పండుగ బౌద్ధ సమాజంతో ముడిపడి ఉంది. ఈ పండుగ 3 నుంచి 4 రోజుల పాటు జరుగుతుంది. నూతన సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని ఇక్కడ కూడా మకర సంక్రాంతిని జరుపుకుంటారని నమ్ముతారు.

థాయిలాండ్ (Thailand)
మకర సంక్రాంతి పండుగను థాయ్‌లాండ్‌లో కూడా జరుపుకుంటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీనిని థాయ్‌లాండ్‌లో సాంగ్‌కార్న్ (Songkran) అని పిలుస్తారు. పురాతన కాలంలో, థాయ్‌లాండ్‌లోని ప్రతి రాజుకు తన స్వంత ప్రత్యేక గాలిపటం ఉండేది. దేశంలో శ్రేయస్సును కాంక్షిస్తూ సన్యాసులు, పూజారులు ఈ గాలిపటాన్ని చలిలో ఎగురవేసేవారు. థాయ్‌లాండ్ రాజులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా తమ ప్రార్థనలను దేవునికి తెలియజేయడానికి గాలిపటాలు ఎగురవేసేవారు.

Watch this interesting Video:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

America: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది.ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.

New Update
crisis

crisis

అంతర్యుద్ధాలతో అట్టుడికే దేశాల్లోని లక్షల మందికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహారం పథకం ద్వారా అందించే సాయాన్ని అమెరికా నిలిపివేసింది. ట్రంప్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆఫ్గానిస్తాన్‌, సిరిమా, యెమెన్‌ తదితర 11 దేశాల ప్రజలు ఆకలితో అలమటించనున్నారు.అమెరికా ప్రభుత్వ సూచన మేరకు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నాం.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

డోజ్‌ లోని యూఎస్‌ఎయిడ్‌ వ్యవహారాలను చూసే జెరెమీ లూవిన్‌ ఈ ఆదేశాలిచ్చారు అంటూ భాగస్వాములకు పంపిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.దీనికి సంబంధించి దాదాపు 60 కి పైగా లేఖలు వివిధ విభాగాలకు గత వారం రోజుల్లో అందాయి.అమెరికా నిర్ణయం పై ప్రపంచంలో అతి పెద్ద ఆహార సహాయ పథకాన్ని నిర్వహించే డబ్ల్యూఎఫ్‌పీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

ఇది లక్షల మందికి మరణ శాసనం అవుతుంది.వారంతా తీవ్ర ఆకలితో అలమటించిపోతారు. ఆకలి చావులు సంభవిస్తాయని తన ఎక్స్‌ పేజీలో పేర్కొంది.ఈ నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని విజ్ఙప్తి చేసింది. ప్రాణాలను కాపాడే పథకాలకు సాయం పై ట్రంప్‌ యంత్రాంగంతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది.ఇప్పటి దాకా చేసిన సాయానికి కృతజ్ఙతలు తెలిపింది.

కోతల నుంచి ఆహారంతో పాటు ప్రాణాధార అత్యవసర సాయాలను మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో పాటు ప్రభుత్వ అధికారులు గతంలోనే హామీ ఇచ్చారు. అయితే సోమవారం ఆయన కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Also Read:EX MLC Jeevan Reddy Vs MLA Sanjay Kumar : మళ్లీ వేడెక్కిన జగిత్యాల రాజకీయాలు..ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్సీ మధ్య వార్‌

Also Read:Kalvakuntla Kavitha : అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

america | boycott | food | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment