దమ్ముంటే రారా చూసుకుందాం .. మానకొండూరులో హై టెన్షన్!

మానకొండూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమయి మధ్య ట్విట్టర్ వార్ నడించింది. గతకొంతకాలంగా ఈ ఇద్దరి నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు రసమయి ఇంటి ముట్టడికి యత్నించారు.

New Update
rasmayi vs kavampally

మానకొండూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.  ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య ట్విట్టర్ వార్ నడించింది. గతకొంతకాలంగా ఈ ఇద్దరి నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయు కామెంట్స్ కు సహానం కోల్పోయిన  కాంగ్రెస్ కార్యకర్తలు రసమయు ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో  మానకొండూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

 బాలకిషన్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం

స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నిస్తే అనుచరులను, కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొల్పి మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిపై దాడి చేయించడం దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రసమయి బాలకిషన్ గారి భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు పునరావృతం కాకుండా సీపీ సిద్దిపేట, తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీష్ రావు ట్వీట్ చేశారు.  

అయితే హరీష్ రావు ట్వీట్ పై ఎమ్మెల్యే కవ్వంపల్లి స్పందించారు.  మీ పార్టీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేసి, సవాళ్లు విసిరి విజ్ఞత లేకుండా నిందారోపణలు చేశారు. ఆధారాలు చూపించి ధైర్యంగా ఎదుర్కోమంటే.. దాక్కున్న వైఖరిని మీరు సమర్థిస్తున్నారా? లేక ఏదో ఒక విధంగా విష ప్రచారాలు చేసి అభివృద్ధిని అడ్డుకునే మీ మాజీ ఎమ్మెల్యేకు మీరు అండగా నిలబడుతున్నారా?  సవాలు విసిరితే తీసుకోవడం రాజకీయ నాయకుడి ముఖ్య లక్షణం, దమ్ముంటే రండి అంటే దాక్కునే వైఖరి మాది కాదు, మేం ప్రజాస్వామ్యానికి కట్టుబడి వుండే సిద్ధాంతాలు కలిగిన వాళ్ళము. ఓపిక నశించిన కార్యకర్తల ఆగ్రహానికి గురయ్యే అనుచిత వ్యాఖ్యలు, అవాస్తవాల కట్టడి చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారా అంటూ ప్రశ్నించారు.  

ఎమ్మెల్యే కవ్వంపల్లి ట్వీట్ రసమయు స్పందించారు.  హైదరాబాదులో దక్కున్నది, హైదరాబాదు దాటి రానిది  నువ్వు, ప్రజల మధ్య ఉంటుంది నేను.  సీఎం రిలీఫ్ ఫండ్ లో నీ కార్యకర్తలు మరియు నీవు చేసిన కుంభకోణం అబద్దమే అయితే  నీ అనుచరులను పోలీసులు అరెస్టు ఎందుకు చేసినట్టు? నియోజకవర్గంలో పంటలు ఎండిపోయి రైతులు అన్నమో రామచంద్ర అంటూ పెద్దలింగాపూర్ రైతులు నీళ్ల కోసం కన్నిరూపెడుతుంటే పరమర్శించాల్సింది పోయి, వాళ్ళని అవమానిస్తూ మాట్లాడినందుకు వాళ్ల  తరపున నేను ప్రశ్నించినందుకా దాడి? నువ్వు నీ అనుచరులను ఉసిగొల్పి నాపై నువ్వు చెయ్యించాలనుకుంటున్న దాడికి భయపడే వ్యక్తిని కాదు. అమాయక కార్యకర్తలను బలిచేయడం ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే నువ్వే రా.. నీ కమిషన్లు దోపిడీ ఆధారాలతో సహా నేను వొస్త.. తేల్చుకుందాం రా కమీషన్ల నారాయణ. అంటూ రసమయు ట్వీట్ చేశారు.  

Also Read :  ఫిక్స్.. రేపే చాహల్తో విడాకులు.. ధనశ్రీకి రూ. 4.75 కోట్ల భరణం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH vs HCA : ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ విచారణ..ఆయన డుమ్మా?

టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం పై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ విచారణకు HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది

New Update
 HCA vs SRH

HCA vs SRH

SRH vs HCA :  టికెట్ల విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు హైదరాబాద్ సన్ రైజర్స్‌కు మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఆ వివాదం ముదిరి ముదిరి పాకాన పడింది. దీంతో ఈ  వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎస్ఆర్‌హెచ్‌పై తీవ్ర ఒత్తిడికి గురి చేయడమే కాకుండా.. ఎక్కువ టికెట్లు కేటాయించాలంటూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ వేధింపులకు గురి చేస్తుందని ఎస్ఆర్‌హెచ్ ఆరోపిస్తూ.. ప్రభుత్వానికి ఈ మెయిల్ చేసింది. అయితే విచారణ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మధ్య నెలకొన్న వివాదం తాత్కళికంగా సద్దుమణిగినట్లు తెలిసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

 ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్‌హెచ్‌ టికెట్ల విషయంలో వేధింపులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపారు. అయితే  ఈ విచారణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు హాజరు కానట్టు తెలిసింది. వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌కు దూరంగా ఉన్నానని ఆయన విజిలెన్స్ అధికారులుకు సమాచారం అందించారట. ఈ నేపథ్యంలో బుధవారం విచారణకు హాజరవుతానని హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పష్టం చేశారు. ఇక హెచ్‌సీఏ సెక్రటరీ బస్వరాజు నుంచి విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. అనంతరం బస్వరాజు స్టేడియం నుంచి వెళ్లిపోయారు. అలాగే విజిలెన్స్ అధికారులు స్టేడియంలోనే విచారణ కొనసాగించారు. మరోవైపు..ఇరు వర్గాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఎస్ఆర్‌హెచ్ నుంచి వెళ్లిన టికెట్లు ఎన్ని.. కాంప్లిమెంటరీ టికెట్లు ఎన్ని.. వాటిని ఏదైనా బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారా..వీటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందజేయాలని విజిలెన్స్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం విజిలెన్స్ అధికారులు ఉప్పల్ స్టేడియం చేరుకున్నారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

 మంగళవారం SRH ప్రతినిధులతో HCA సెక్రటరీ దేవరాజ్‌ జరిపిన చర్చలు తాత్కాలికంగా సఫలం అయ్యాయి. SRH, HCA, బీసీసీఐ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందాన్ని పాటించాలని SRH ప్రతిపాదించింది. పాత ఒప్పందం ప్రకార‌మే స్టేడియం సామ‌ర్థ్యంలోని 10 శాతం కాంప్లిమెంట‌రీ పాసులను హెచ్‌సీఏకు కేటాయించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లను విజ‌య‌వంతంగా నిర్వహించేందుకు ఎస్ఆర్‌హెచ్‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తామ‌ని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదాల‌న్నీ ముగిశాయని హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్‌ ప్రక‌టించాయి.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు