టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం టెన్త్ పరీక్షలు 2025 షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి.

New Update
TS SSC Exams: ఆ ఎగ్జామ్ రెండు రోజులు రాయాలా?.. పదో తరగతి పరీక్షలో మార్పు!

SSC Exam: తెలంగాణ ప్రభుత్వం  పదవ తరగతికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ని విడుదల చేసింది. 2025 మార్చి 21 నుంచి ఏప్రిల్ వరకు పరీక్షలు నిర్వహించున్నట్లు విద్యాశాఖ తెలిపింది. టెన్త్ పరీక్షలు ఉదయం  9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12.30  నిమిషాల  వరకు పరీక్ష జరగనున్నట్లు తెలిపారు. 

ప‌ది ప‌రీక్ష‌ల టైం టేబుల్ ఇదే..

  • మార్చి 21(శుక్ర‌వారం) – ఫ‌స్ట్ లాంగ్వేజ్
  • మార్చి 22(శ‌నివారం) – సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 24(సోమ‌వారం) – థ‌ర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లీష్‌)
  • మార్చి 26(బుధ‌వారం) – గ‌ణితం
  • మార్చి 28(శుక్ర‌వారం) – సైన్స్‌(ఫిజిక‌ల్ సైన్స్‌)
  • మార్చి 29(శ‌నివారం) – సైన్స్‌(బ‌యోలాజిక‌ల్ సైన్స్‌)
  • ఏప్రిల్ 2(బుధ‌వారం) – సోష‌ల్ స్ట‌డీస్
  • ఏప్రిల్ 3(గురువారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -1
  • ఏప్రిల్ 4(శుక్ర‌వారం) – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ -2

Also Read: ఎయిర్‌పోర్టులో జర్నలిస్టులతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. వీడియో వైరల్

ఇప్పటికే  పదో తరగతి పరీక్షల్లో పలు మార్పులు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 80 మార్కులకు ఉన్న పరీక్ష పేపర్‌ను ఇకపై 100 మార్కులకు ప్రిపేర్ చేయనున్నట్లు తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-2025 నుంచి 100 మార్కులకే పరీక్ష పేపర్ ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది.  అయితే గతేడాది వరకు 80 మార్కులకు పేపర్ ఉండగా.. 20  ఇంటర్నల్  మార్కులు ఉండేవి.

ఈ పద్ధతిని ఇకపై ఆపేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ గ్రేడింగ్ సిస్టమ్‌ను కూడా తీసేస్తున్నట్లు వెల్లడించింది.  ఇంటర్నల్ పరీక్షల్లో అక్రమాలు జరుగుతున్నాయని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఫైనల్ పరీక్షల్లో కూడా విద్యార్థులకు 24 పేజీల ఆన్సర్‌ బుక్‌లెట్స్‌ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చూడండి:ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక

రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

New Update
Rains

Rains

 Rain Alert : ఒకవైపు ఎండలు మండుతుంటే మరోవైపు వరుణుడు కూడా తన సత్తా చాటుతున్నాడు. పొద్దంతా ఎండలు రాత్రి వర్షాలు అన్నట్లు వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రానున్న మూడురోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది.

Also read: KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా

నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉందని తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉందని, ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. తర్వాత దిశను మార్చుకొని ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి.. రాగల 24గంటల్లో మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనంగా పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.


 ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

ఈ క్రమంలో మంగళవారం ములుగు, కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం భూపాపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. 11న ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేటతో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Also read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment