మంత్రి ఉత్తమ్ ఇంట్లో విషాదం!

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
uttam kumar reddu

తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి పురుషోత్తం రెడ్డి ఈ రోజు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పురుషోత్తం రెడ్డి ఈ రోజు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఈ రోజు పురుషోత్తం రెడ్డి అంత్యక్రియలను నిర్వహించనున్నారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పురుషోత్తం రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

విషాదంలో తాటిపాముల..

ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వస్థలం ప్రస్తుత సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలోని తాటిపాముల. పురుషోత్తంరెడ్డి మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది. పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు పలువురు గ్రామస్తులు హైదరాబాద్ కు వస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు