TG High Court : HCU భూ వివాదం.. హైకోర్టు సంచలన నిర్ణయం!

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.  ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది

New Update
tg-high-court-hcu

tg-high-court-hcu

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై 2025 ఏప్రిల్ 07వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.  ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్, రిపోర్ట్ ఈనెల 24లోగా సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. ప్రభుత్వం నుంచి సీనియర్‌ అడ్వకేట్‌గా మేనకా గురుస్వామి తన వాదనలు వినిపించారు.  కాగా కంచ గచ్చిబౌలి భూములలో పనులు ఆపేయలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.  తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. 

Also Read :  Fake Hair Growth : ఘరానా మోసగాడు.. బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటూ గుండ్లు కొట్టి పరార్!

మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై  తప్పుడు, మార్ఫింగ్‌ చేసిన వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు అందించారు.  ఏఐ ఉపయోగించి తప్పుడు పోస్టులు పెట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు.  2025 ఏప్రిల్ 9, 10, 11న గచ్చిబౌలి పీఎస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడించారు.  

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

Also read :  MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్‌..  ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!

పహల్గామ్ ఉగ్రదాడి ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hyderabad Skywalks4

Hyderabad

Pahalgam Terror Attack: జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలోని కొన్ని నగరాలకు ఉగ్ర ముప్పు ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్ విధించారు. ముఖ్యంగా ముంబై నగరాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వెంటనే హైఅలర్ట్ జారీ చేశారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

ఈ నగరాల్లోనే..

ఉగ్రవాదుల ఎక్కువగా మెట్రో నగరాలు, జనాభా అధికంగా ఉన్న దగ్గర దాడులు చేస్తారు. గతంలో ముంబైలో వరుస పేలుళ్లు, హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల వంటి ముష్కర దాడులను ఇంకా జనం మర్చిపోలేదు. ఈనేపథ్యంలోనే తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశమున్నట్లుగా అంచనా వేశారు.

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఇదిలా ఉండగా.. జమ్మూకశ్మీర్‌ పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. స్టీల్ టిప్డ్ బుల్లెట్లు, AK-47 రైఫిళ్లు, బాడీ కెమెరాలు ధరించిన నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల బృందం హిందూ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి జమ్మూ కాశ్మీర్ సందర్శించడానికి వెళ్లిన పర్యాటకులు మృతి చెందారు. 

Advertisment
Advertisment
Advertisment