Gurumurthy Remand Report : పంచాయతీ పెట్టి పరువు తీసిందని ప్రాణం తీశాడు.. గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

మీర్‌పేట్‌లో భార్య మాధవీని అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందుకు సంబంధించిన విషయాలను పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో వివరించారు. పంచాయతీ పెట్టి తన పరువు తీసినందుకే భార్యను కడతేర్చినట్లు తేల్చారు.

New Update
Gurumurthy Remand

Gurumurthy Remand

Gurumurthy Remand Report : మీర్‌పేట్‌లో భార్య మాధవీని అత్యంత దారుణంగా హత్య చేసిన గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెలుగు చూశాయి. అందుకు సంబంధించిన విషయాలను పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో వివరించారు. పంచాయతీ పెట్టి తన పరువు తీసినందుకే భార్యపై గురుమూర్తి కోపం పెంచుకొన్నాడని ఆ క్రమంలో ఆమెను ఎలాగైనా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడని పోలీసులు వివరించారు. దానికోసం వేచిచూశాడు. అందుకోసం పక్కా ప్రణాళికతో స్కెచ్ వేశాడు. అనుకున్నట్లే అంతం చేశాడని పోలీసులు వివరించారు.

Also Read :  గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలో వారి ఖాతాల్లోకి రూ.లక్ష!

తను ప్లాన్‌ అమలు చేయడానికి సమయం కోసం చూస్తున్న గురుమూర్తి జనవరి 15 న తన ప్లాన్‌ అమలుకు ఎంచుకున్నాడు. అనుకున్నట్లే తన పిల్లలను తన చెల్లెలు ఇంటి వద్ద వదిలేశాడు.16న తన పుట్టింటికి వెళ్తానన్న భార్య మాధవీతో గురుమూర్తి గొడవ పడ్డాడు. అదే సమయంలో తనకు..మీ చెల్లెలు ఇంట్లో ఉండడం ఇష్టం లేదని మాధవీ తేల్చి చెప్పడంతో పిల్లలను అక్కడే వదిలి భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను పుట్టింటికి ఎందుకు పంపడం లేదంటూ మాధవీ నిలదీయడంతో గురుమూర్తిలో అప్పటివరకు నిద్రపోతున్న సైకో నిద్రలేశాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. కోపంతో ఊగిపోయిన గురుమూర్తి భార్య మాధవి గొంతు పిసికి హత్య చేశాడు. హత్య అనంతరం అదే రోజు మాధవీ శరీరాన్ని ముక్కులుగా కట్‌ చేశాడు. అనంతరం వాటిని వాటర్‌ హీటర్‌తో ఉడికించాడు. అనంతరం ఎముకలను పొడిచేసి మిగిలిన మాంసం ముక్కలను బకెట్‌లో తీసుకెళ్లి పెద్ద చెరువులో పడవేశాడు. మరోవైపు అప్పటికే రెండు రోజులుగా తన కూతురు కనిపించకుండా పోవడంతో మాధవి తల్లికి అనుమానం వచ్చి గురుమూర్తిని నిలదీసింది. అయితే తనతో గొడవపెట్టుకుని ఎటో వెళ్లిపోయిందని గురుమూర్తి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె  భర్తతో గొడవ పడి.. ఇంటి నుంచి వెళ్లిపోయిందంటూ మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు కింద మీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read :  నువ్వేం శాడిస్ట్ మొగుడివిరా.. భార్య విడాకులు అడిగిందని చలాన్లతో రివేంజ్!

పోలీసులు మాధవి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విచారణలో భాగంగా గురుమూర్తి ఇంటికి సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అదే సమయంలో గురుమూర్తి కదలికలపై అనుమానం వచ్చి ఓ కన్నేసి ఉంచారు. కాగా 15న మాధవితో పాటు ఇంట్లోకి వెళ్లిన గురుమూర్తి మరునాడు బకెట్‌తో బయటకు రావడం మాత్రమే సీసీ కెమెరాల్లో రికార్డు కావడం పోలీసులు గుర్తించారు. దీంతో మరింత అనుమానం బలపడింది. అనుమానంతో స్టేషన్‌కు పిలిపించినప్పటికీ గురుమూర్తి సరైన సమాచాం ఇవ్వలేదు. అయితే మాధవీ కుటంబసభ్యులనుంచి ఒత్తిడి రావడంతో తట్టుకోలేక తానే మాధవిని చంపినట్లు ఆమె తండ్రి వెంకటరమణకు తెలిపాడు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. గురుమూర్తి ఇచ్చిన క్లూస్ ఆధారంగా పోలీసులు.. మీర్ పేటలోని చెరువులో పెద్ద గజ ఈతగాళ్లతో వారం రోజుల పాటు వెతికించారు. మాంసం ముక్కలు పడేసిన బకెట్ లభ్యమైంది.

ఇది కూడా చదవండి: నాలుకపై ఎరుపు, తెలుపు మచ్చలు క్యాన్సర్ సంకేతమా?
 
కాగా మాధవి మాంసాన్ని ఉడికించిన సమయంలో కమురు వాసన వచ్చినట్లు చుట్టుపక్కల వారు కూడా సమాచారం ఇచ్చారు. మాధవిని హత్యచేయడానికి ఉపయోగించిన కత్తి, రంపం, స్టవ్, ఫినాయిల్ సీసాలతోపాటు పెయింట్ బకెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Sankranthiki Vasthunam: వెంకీ మామ ఫ్యాన్స్ గెట్ రెడీ.. యూట్యూబ్ లో 'గోదారి గట్టు మీద' సాంగ్ ఫుల్ వీడియో

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment