BREAKING : SLBC టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం.. కనిపించిన కార్మికుడి చేయి!

SLBC టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. టన్నెల్లో టిబిఎం ముందు భాగంలో మృతదేహం గుర్తించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఒక కార్మికుడి చెయ్యి ని గుర్తించినట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. మృతదేహాన్ని బయటకు తీసేందుకు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి

author-image
By Madhukar Vydhyula
New Update
SLBC tunnel rescue

SLBC tunnel rescue

 
 Progress in SLBC tunnel rescue :  SLBC టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. టన్నెల్లో టిబిఎం ముందు భాగంలో ఒక డెడ్ బాడీ గుర్తించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఒక కార్మికుడి చెయ్యి ని గుర్తించినట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. ఆ మృతదేహాన్ని బయటకు తీసేందుకు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. 16రోజులుగా జరుగుతున్న టన్నెల్ రెస్క్యూలో ఇది కీలక పరిణామం. జీపీఆర్‌, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారా బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్‌లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.

Also Read: పెళ్లి చేసుకోకుండా శ్మశానవాటికలోనే.. ఈమెకు బతుకున్న మనుషులంటే భయమట!
 
  ఇదిలా ఉండగా టన్నెల్ రెస్క్యూ పనులను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... ఐఐటీ ఎక్స్‌‌పర్ట్స్‌‌తో పాటు కేరళ నుంచి క్యాడవర్‌‌ స్నిఫర్‌‌ డాగ్స్‌‌ను కూడా తెప్పించింది. మానవ శరీర అవశేషాలు, కుళ్లిపోయిన మృతదేహాలు, 15 అడుగుల కింద బురదలో కూరుకుపోయిన డెడ్‌‌బాడీలను సైతం గుర్తించడం, గాలిలో, భూమిలోపల వాసనను పసి గట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండడం ఈ డాగ్స్‌‌ ప్రత్యేకత. ఈ డాగ్స్‌‌ను ఎయిర్‌‌ఫోర్స్‌‌కు చెందిన రెండు హెలికాప్టర్లలో కేరళ నుంచి దోమలపెంటలోని టన్నెల్‌‌ వద్దకు గురువారం తీసుకొచ్చారు. టన్నెల్‌‌లోని 13.600 కిలోమీటర్‌‌ వద్ద, టీబీఎం పరిసరాల్లో మట్టి, బురదలో కూరుకుపోయిన వారిని ఈ డాగ్స్‌‌ గుర్తిస్తాయని భావిస్తున్నారు.

Also Read: మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వండి.. రాష్ట్రపతికి మహిళా నేత సంచలన లేఖ!
 
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది.  ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్‌ ఎండ్‌ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్‌ హోల్‌ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు. కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 

Also Read: CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...సోమవారంతో ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగింపు

కన్వేయర్‌ బెల్ట్‌ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్‌ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 

Also Read: PM MOdi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ

Also Read: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Cricket Betting : బెట్టింగ్ భూతానికి యువకుడు బలి..

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది.

New Update
A young man falls victim to the betting craze..

A young man falls victim to the betting craze..

IPL Betting: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొంతమంది. వ్యసనంగా మారి మరికొందరు బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ లో లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఏం చేయలేని పరిస్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెట్టింగ్ రాక్షసి మరో యువకుడ్ని మింగేసింది. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్న ఓ యువకుడు బెట్టింగ్ లో సర్వం పోగొట్టుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!
 
ఒకవైపు రోజు మీడియాలో బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్న అనర్థాలను చూస్తున్నప్పటికీ యువత ఆ మార్గం నుంచి బయట పడడం లేదు. బెట్టింగ్ యాప్స్ బారిన పడి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్, ఈజీ మనీ ఆశతో చాలా మంది డబ్బులు, ఆస్తులు పొగొట్టుకొని, ఆర్థిక ఒత్తిడితో ప్రాణాలు తీసుకుంటున్నారు. దీని వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ యువకుడు బెట్టింగ్ కారణంగా అన్ని పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు. గణేష్ అనే 26 ఏళ్ల యువకుడు మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎంఏ నగర్‌లో కుటుంబ సభ్యులతో కలసి ఉంటున్నాడు. ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తున్న గణేష్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: వంటలో ఈ మూడు పదార్థాలు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు
 
క్రికెట్ బెట్టింగ్ కారణంగానే గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. గణేష్ లోన్ యాప్స్, ఫ్రెండ్స్ వద్ద అప్పులు చేసి బెట్టింగ్ లు పెట్టేవాడని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడం కూడా అతడి సూసైడ్‌కు కారణాలని పోలీసులు అంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

Advertisment
Advertisment
Advertisment