MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్!
ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.
ఎమ్మెల్సీ కవిత ఫోన్ హ్యాక్ అయింది. తన సోషల్ మీడియా ఖాతాలు ఎవరో హ్యాక్ చేశారంటూ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు కవిత.
రైతుబంధు నిధులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని అన్నారు. అలాగే ఒకేదఫాలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రైతులు ఎవరు అధైర్యపడొద్దని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగల్లిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్టులో సెక్యూరిటీ గార్డు ఇరుక్కుపోయాడు. రెండు కాళ్లు బయట.. బాడీ లోపల ఉండిపోవడంతో నరకయాతన అనుభవించాడు. ఈ ఘటనలో అతడికి కాళ్లు చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది.
రేవంత్ సర్కార్ త్వరలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఎంపీ ఎన్నికలకు ముందే అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై ఇంకా క్లారిటీ రాలేదు. తమ పదవీకాలాన్ని పొడిగించాలని సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఎంపీ ఎన్నికల తరువాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సర్పంచుల పదవీకాలం FEB 1తో ముగియనుంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు, ఎంపీ టికెట్లపై ఆయన ఈరోజు కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే గవర్నర్ కోటాలో కోదండరాంకు ఎమ్మెల్సీ టికెట్ ఖాయమైనట్లు సమాచారం. దీనిపై రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్, మహేష్ గౌడ్ పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. షబ్బీర్అలీ, ఫిరోజాఖాన్ పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని సమాచారం.
ఈరోజు నుంచి తెలంగాణలోని అన్ని ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేదీ నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. అలాగే.. ఇంటర్ విద్యార్థులకు రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణలో అధికారం మారడంతో వివిధ మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా బెల్లంపల్లిలో 21 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరుతామని వారు ప్రకటించారు. వీరు త్వరలోనే చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఇచ్చే అవకాశం ఉంది.