Modi Govt: హరీశ్, కేటీఆర్‌కు మోదీ అదిరిపోయే గిఫ్ట్.. అసలేం జరుగుతోంది?

బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట, సిరిసిల్లను కలుపుతు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1100 కోట్లకు అనుమతులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన భూసేకరణ త్వరలో ప్రారంభం కానుంది.

New Update
Narendra Modi

బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ కు కేంద్రంలోని మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. వీరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను కలుపుతూ హైవే నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు నలుగు లైన్ల హైవే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి రూ.1100 కోట్లను అనుమతులు ఇచ్చింది. ఈ రోడ్డు పొడవు 36 కి.మీ ఉండగా.. 25 చోట్ల డేంజర్ మలుపులు ఉన్నాయి.ఇప్పటికే సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ వరకు హైవే 365బీ ఉంది. అయితే.. ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ రోడ్డును సిద్దిపేట మీదుగా సిరిసిల్ల వరకు పొడిగించనున్నారు. దీంతో దుద్దెడ–సిద్దిపేట మధ్య పనులు చేపట్టారు.  సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెళ్లేవారు ఈ రోడ్డుపైనే రాకపోకలు సాగిస్తుంటారు.
ఇది కూడా చదవండి: నువ్వు బ్రోకర్ వి కాదు.. సీఎం రేవంత్ పై ఈటల ఫైర్!

36 కి.మీ దూరం..

సిరిసిల్ల నుంచి సిద్దిపేట వరకు 36 కి.మీ దూరం ఉంటుంది. ఈ రోడ్డుపై 25చోట్ల డేంజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మలుపులు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతీ కిలో మీటరున్నరకు ఓ మలుపు ఉంటుందన్నమాట. దీంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంతో వాహనదారుకలు ఈ టర్నింగ్ ల టెన్షన్ తప్పనుంది. ఈ రోడ్డు మార్గంలో సిరిసిల్ల మానేరు వాగుపై మరో కొత్త బ్రిడ్జిని నిర్మించనున్నారు. 

ఇది కూడా చదవండి: BREAKING: సీఎం రేవంత్ ఇలాఖాలో హై‌టెన్షన్.. ఇంటర్నెట్ బంద్!

150 ఫీట్ల వెడెల్పు.. 54 కి.మీ పొడుగు..

సూర్యాపేట నుంచి దుద్దెడ వరకు ఉన్న ఈ రహదారి 365బీని ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ మొత్త 54 కి.మీ మేర రోడ్డును నిర్మించనున్నారు. 150 అడుగుల(ఫీట్ల) వెడల్పుతో రూ.1100 కోట్ల నిధులతో ఈ నేషనల్ హైవేను కేంద్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌ సైతం పూర్తి అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. నూతనంగా నిర్మించనున్న దుద్దెడ, సిద్దిపేట, సిరిసిల్ల రూట్లో త్వరలోనే భూసేకరణను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. సిరిసిల్లలోని బైపాస్ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపం నుంచి ఈ రోడ్డుకు అధికారులు అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. 

Also Read :  BREAKING: పోసానిపై కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం!

sircilla-siddipeta highway

ప్రత్యేకత లేదంటున్న బీఆర్ఎస్, బీజేపీ..

బీఆర్ఎస్ కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు నియోజకవర్గాలు కలుపుతూ చేపట్టబోయే హైవే నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మాత్రం దీనికి ప్రత్యేకత ఏమీ లేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు. అమృత్ స్కీమ్ టెండర్లలో రేవంత్ తన బావమరిది సృజన్ కు లబ్ధి చేశాడని ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మరో వైపు కేసుల నుంచి కాపాడుకోవడానికే కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నాడని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Also Read :  ఈ గర్భనిరోధక మాత్రలకు ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Thatikonda vs Kadiyam : కడియం టాల్ లీడర్ కాదు, ఫాల్ లీడర్...మాజీ మంత్రి రాజయ్య సంచలనవ్యాఖ్యలు

స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై కడియం చేసిన ఆరోపణలకు తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు.

New Update
 Thatikonda Rajaiah vs kadiyam srihari

Thatikonda Rajaiah vs kadiyam srihari

 Thatikonda vs Kadiyam : స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కౌంటర్ ఇచ్చారు. ఆయ‌న మీడియాతో మాట్లడుతూ.. కడియం శ్రీహరీ నీది నాలికా తాటి మట్టా..? తిన్నింటి వాసాలు లెక్కపెట్టే నీచ సంస్కృతి నీది.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత మీద వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. నువ్వు అన్నం తింటున్నవా..గడ్డి తింటున్నావా.. పదేళ్లు ఆ కుటుంబంలో అంతరంగికుడిగా ఉన్నావ్ కదా.. కాంగ్రెస్ పార్టీలో చచ్చిన పాములా పడి ఉన్నావ్.. ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. లేకపోతే నిన్ను బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్ల మీద తిరగనివ్వరు అని హెచ్చరించారు. న‌మ్మక‌ద్రోహానికి ప్రతిరూపం నువ్వు.. నీ ప్రవర్తన.. నీ ద్రోహాన్ని చూసి కాంగ్రెస్ వాళ్లు కూడా ఉమ్మేస్తున్నారు.1994 కు ముందు నీ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? అని ప్రశ్నించారు. 30 ఏళ్లలో ఎలా కుబేరుడు అయ్యావు.. నీ ఇళ్ళు, దేవునూరు భూములు, పెట్రోల్ బంకులే నీ అవినీతికి సాక్ష్యం అన్నారు.. విదేశాలలో నీ ఆస్తులే సాక్ష్యం..ఇంకొకసారి నీతి, నిజాయితీ గురించి మాట్లాడవద్దు అని మండిప‌డ్డారు.

Also Read: పసిబిడ్డల ఉసురు తీస్తున్న అక్రమ సంబంధాలు.. ఈ ఏడాది ఎంతమందిని చంపేశారంటే!

ఇంకా ఆయన మాట్లాడుతూ, “చనిపోయిన పాము కొస తోకకు ప్రాణం ఉన్నట్టు కడియం రాజకీయం ఉండేది ” అంటూ ఘాటుగా స్పందించారు. కడియం శ్రీహరికి రాజకీయ జన్మ ఇవ్వడంలో ముందుగా కేసీఆర్ పాత్ర ఉందని, రెండోసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి సహకారంతోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ లభించిందని రాజయ్య పేర్కొన్నారు.అలాగే, స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి పాత్రను ప్రస్తావిస్తూ, “వేడినీళ్లకు చన్నీళ్ల లాగా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరించారు. అభివృద్ధి విషయాల్లో ఆయన పాత్ర ఘణనీయమైంది” అని అన్నారు. కేసీఆర్ మాటల్లో ఎప్పుడూ కడియం పేరు రాలేదని, అయినప్పటికీ ఆయన తన స్థాయిని మరిచి ప్రెస్ మీట్‌లో సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఇక కడియం శ్రీహరి పాలన గురించి మాట్లాడుతూ, “ఇప్పుడిది ప్రజాస్వామ్యం కాదు, అక్రమ అరెస్టులతో ఒక వర్గానికి అనుకూలంగా పాలన సాగుతోంది. ప్రజల స్వేచ్ఛలు హరించబడుతున్నాయి” అని ఆరోపించారు.అంతేకాకుండా… “రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్‌పూర్ ప్రజలకు జీవితాంతం గులామ్‌గిరి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది” అంటూ రాజయ్య హెచ్చరించారు. ఆయన కడియంపై ఆస్తుల విషయమై కూడా ఆరోపణలు చేశారు. “దేవనూరు పరిసర ప్రాంతాల్లో బినామీ పేర్లతో భూములు ఉన్నాయా? కుటుంబంతో కలిసి పాలేరు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నావా?” అంటూ ప్రశ్నలు సంధించారు.మొత్తం 23 మంది రైతులకు చెందిన 43 ఎకరాల 38 గుంటల భూమిని బినామీ పేర్లతో స్వాధీనం చేసుకున్నారని పేర్కొంటూ, “ఇది వాస్తవం కాదా?” అంటూ రాజయ్య నిలదీశారు. చివరగా, “నీవు టాల్ లీడర్ (ఎత్తైన నాయకుడు) కాదు, ఫాల్ లీడర్ (పడిపోయే నాయకుడు)” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Also Read: అమెరికా ఆహారం బంద్‌..11 దేశాలకు కష్టం!

Also read :  Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!

Advertisment
Advertisment
Advertisment