KTR: కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌పై బీజేపీ మౌనం.. కారణమేంటి?

అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది.

New Update

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేపట్టిన ఢిల్లీ టూర్‌పై తెలంగాణ బీజేపీ మౌనం పాటించడం అనుమానాలకు తావిస్తోంది. అమృత్‌ స్కీం టెండర్లపై ఆ పార్టీ ముఖ్య నేతలు ఇంత వరకు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇవ్వకపోవడంపై రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. తెలంగాణలో అమృత్ స్కీం టెండర్లలో అవకతవకలు జరిగాయని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే వ్యవహారంలో కేంద్ర మంత్రి ఖట్టర్‌కు ఫిర్యాదు చేశారు. అమృత్ టెండర్లకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నోరు విప్పడం లేదు. ఈ అంశంపై బీజేపీ నేతలు దాటవేత ధోరణి అవలంభించడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డితో బీజేపీ నేతలు కలిసిపోయారని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ ఫిర్యాదు నేపథ్యంలో బీజేపీ నేతల రియాక్షన్‌ ఎలా ఉంటుందనేదానిపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇది కూడా చదవండి: పోలీసులే కారణం.. లగచర్ల ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు సంచలనం!

గవర్నర్ కోర్టులో బంతి..

ప్రివెన్షన్ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17ఏ ప్రకారం మంత్రిగా పని చేసిన కేటీఆర్ ను విచారించాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గవర్నర్ కు ప్రభుత్వం నుంచి లేఖ రాసింది. అయితే.. గవర్నర్ ఇందుకు సంబంధించి అటార్నీ జనరల్ కు లేఖ రాశారు. అటార్నీ జనరల్ సూచన ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే అటార్నీ జనరల్, గవర్నర్ నడుచుకుంటారన్న ప్రచారం సాగుతోంది.
ఇది కూడా చదవండి: KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?

అటార్నీ జనరల్ గవర్నర్ కు ఈ కింది మూడు సూచనల్లో ఏదో ఒకటి ఇచ్చే అవకాశం ఉంది..
1. విచారణలో అప్పటి మంత్రులను పక్కన పెట్టాలని..
2. నిధుల మళ్లింపులో బిజినెస్ రూల్స్ ను బ్రేక్ చేయలేదని..
3. కేటీఆర్ పై విచారణ జరపొచ్చు..

Also Read :  అరెస్టులు ఖండిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి..డీజీపీకి జేఏసీ ఫిర్యాదు

Also Read :  ఆ కడుపు మంటతోనే చేశాడు.. కొడంగల్ ఘటనపై పట్నం నరేందర్ రియాక్షన్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

విషాదం.. సరదాగా పొలానికి వెళ్లిన చిన్నారి.. ఆ తర్వాత ఏమైందంటే?

కరీంనగర్‌లో సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అత్తమ్మ వాళ్లు పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లి ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. ట్రాక్టర్‌తో పాటు చిన్నారి బావిలోకి దూసుకెళ్లడంతో మృతి చెందింది.

New Update
suryapet crime

Crime

సరదాగా అత్తమ్మ ఇంటికి వెళ్లిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ మూడేళ్ల చిన్నారి అత్తమ్మ ఇంటికి సరదాగా వెళ్లింది. అత్తమ్మ కుటుంబ సభ్యులు అందరూ కూడా పొలానికి వెళ్తుంటే వారితో సరదాగా వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ఎక్కిస్తే నవ్వుతూ కూర్చొంది.

ఇది కూడా చూడండి: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..

ఒక్కసారిగా తాళం తిప్పడంతో..

ఆమెను ట్రాక్టర్ ఎక్కించిన తర్వాత అత్తమ్మ కొడుకును ఎక్కించడానికి పక్కకి వెళ్లారు. ఇంతలో ఆ మూడేళ్ల పాప ట్రాక్టర్ తాళాన్ని ఒక్కసారిగా తిప్పింది. దీంతో ఆ చిన్నారితో పాటు ట్రాక్టర్ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

ఇది కూడా చూడండి: Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో పెళ్లై పిల్లలు ఉన్న మహిళలు వివాహేతర సంబంధాలతో కట్టుకున్న భర్తలను చంపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ప్రియుడితో కలిసి  కట్టుకున్న భర్తను భార్య కిరాతకంగా చంపిన ఘటన మరువకముందే.. ఆ తరహా ఘటన మరొకటి చోటుచేసుకోవడం కలకలం సృష్టించింది.

ఇది కూడా చూడండి: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం రాయ్‌బరేలీలో స్థానికంగా ఉండే ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఇందుకోసం వారు ఓ తుపాకీని కూడా అనంతరం మృతదేహాన్ని సమీపంలోని ఓ పొలంలో పడేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.  అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తులో భార్య, ఆమె ప్రియుడు నిందితులని తెలుసుకుని అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు.  

Advertisment
Advertisment
Advertisment