రేవంత్ ఛాలెంజ్‌ స్వీకరించిన కిషన్ రెడ్డి..3 నెలలు అక్కడే నిద్ర!

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ విసిరిన ఛాలెంజ్ ను బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. శనివారం మూసీ పరీవాహకంలోనే భోజనం చేసి పేదల ఇళ్లలోనే నిద్రిస్తామని ప్రకటించారు. అవసరమైతే 3 నెలలు నిద్రించడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. 

New Update
Kishan Reddy : నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. సీఎం రేవంత్ కు కిషన్ రెడ్డి సవాల్!

Hyderabad: హైదరాబాద్ మూసీ వివాదంపై తెలంగాణ నేతల మధ్య వార్ రసవత్తరంగా మారింది. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటున్న నాయకులు మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ చేసిన ఛాలెంజ్ ను బీజేపీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వీకరించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. శనివారం మూసీ పరీవాహకంలోనే భోజనం చేసి పేదల ఇళ్లలోనే నిద్రిస్తామని ప్రకటించారు. 

ఇదే బీజేపీ నినాదం..

'మూసీ వద్ద ఒక్క రోజే కాదు.. అవసరమైతే మూడు నెలలు నిద్రించడానికైనా సిద్ధంగా ఉన్నాం. పేదల ఇళ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేయాలన్నదే బీజేపీ నినాదం. పునరుజ్జీవం పేరిట రేవంత్‌రెడ్డి పేదల ఇళ్లు కూల్చడం దుర్మార్గపు చర్య. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మహారాష్ట్రలో అవాస్తవాలను ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు స్వర్గసీమ అంటూ రాహుల్‌గాంధీ పొగుడుతుంటే రేవంత్‌ జబ్బలు చరుచుకోవడం విడ్డూరం. అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ నేతలు తెలంగాణలో యాత్రలు చేపట్టి అనేక హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిలో ఒక్కదాన్ని కూడా  అమలు చేయట్లేదు. రైతు రుణమాఫీ కూడా అరకొరగానే చేశారు. తెలంగాణలో మాటలు ప్రజలకు, మూటలు కాంగ్రెస్‌ పార్టీకి అన్న చందంగా ఉంది. కేసీఆర్‌ మాదిరే రేవంత్‌రెడ్డి పాలన సాగుతోంది' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: TG Group-3: రేపే గ్రూప్-3 పరీక్ష.. అభ్యర్థులకు నిపుణుల కీలక సూచన!

ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని, బీఆర్ఎస్ ఇచ్చిన వాటికే తాము ఉద్యోగాలిచ్చినట్లు ప్రచారం చేస్తోందన్నారు. అలాగే లగచర్ల ఘటనపై స్పందించిన కిషన్ రెడ్డి.. రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెట్టాలన్నా, భూసేకరణ చేయాలన్నా  రైతులతో చర్చలు జరపాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా విలేజ్‌ భూసేకరణకు సంబంధించి కలెక్టర్‌ మీద దాడి జరిగి రైతులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: సిఫార్సులకు విరుద్ధంగా గ్రౌటింగ్‌.. ఎన్డీఎస్‌ఏ లేఖలో బయటపడ్డ సంచలనాలు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

హైదరాబాద్‌లో షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌ అయిన నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.

author-image
By B Aravind
New Update
Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

Hyderabad Police Sent Notices to Pakistani nationals on short on visa

పహల్గాం ఉగ్రదాడి ఘటనతో హై అలెర్ట్ నెలకొంది. భారత్‌లో ఉంటున్న పాకిస్తానీయులపై  పోలీసులు నిఘా పెడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఉంటున్న నలుగురు పాకిస్తానీయులను పోలీసులు గుర్తించారు. వాళ్లని షార్ట్‌ టర్మ్ వీసా హోల్డర్స్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ నలుగురికి నోటీసులు జారీ చేశారు. రేపటిలోగా హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు.    

Also Read: దాడిపై దర్యాప్తు సిద్ధమని కాళ్ల బేరానికి పాకిస్తాన్.. మాకు నీళ్లు కావాలి!

Hyderabad Police Sent Notices To Pakistani Nationals

మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్‌లో 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఇందులో 209 మందికి లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్నాయి. మిగతా నలుగురికి షార్ట్‌ టర్మ్‌ వీసాలు ఉన్నాయి. ఈ నలుగురి పైనే పోలీసులు నిఘా పెట్టారు. రేపటిలోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే లాంగ్‌టర్మ్‌ వీసాలు ఉన్నవాళ్లని మాత్రం కేంద్రం మినహాయించింది.  

ఇదిలాఉండగా.. దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్థానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29 లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులకు ఫోన్‌లు చేసి తమ తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు.  దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. 

Also Read: గుజరాత్‌లో 550 మంది బంగ్లాదేశీయులు అరెస్టు!

మరోవైపు హైదరాబాద్ పోలీసులు గురువారం ఓ పాక్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఫయాజ్ అనే యువకుడు గతంలో హైదరాబాద్కి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్కు వచ్చాడు. దీంతో మహమ్మద్ ఫయాజ్ను గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ పాక్ యువకుడు దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.  

Also Read: అమర్నాథ్ యాత్రపై స్పెషల్ ఫోకస్.. కేంద్రం కీలక నిర్ణయం

Also Read :  పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు.. సీఎం సిద్ధరామయ్య సంచలన కామెంట్స్

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment