Harsha Sai: హర్షసాయికి బిగ్ రిలీఫ్.. హైకోర్టు ముందస్తు బెయిల్

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయికి బిగ్ రిలీఫ్ లభించింది. లైంగిక వేధింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హర్షసాయి తనను పెళ్లిపేరుతో శారీరకంగా వాడుకున్నాడంటూ ఓ యువతి నర్సింగ్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే.

New Update
Harsha Sai bail

యూ ట్యూబర్ హర్ష సాయికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తనపై పెట్టిన కేసు చెల్లదని హైకోర్టును హర్ష సాయి ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హర్షసాయి తరఫున అడ్వకేట్ తానికొండ చిరంజీవి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హర్షసాయిపై పెట్టిన కేసు చెల్లదంటూ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హర్ష సాయి లాయర్ మాట్లాడుతూ.. హర్షసాయిపై పెట్టిన అక్రమ కేసు చెల్లదన్నారు. కోర్టులో సాయి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని మేలిమి ముత్యంలా బయటకు వస్తాడన్నారు. మరింత బలమైన శక్తి గా మారి హర్ష సమాజానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాక్షించారు.
ఇది కూడా చదవండి: రేవంత్‌ సర్కార్‌కు బిగ్ షాక్.. కులగణనకు బ్రేక్

గత నెలలో ఫిర్యాదు..

గత నెల 24న ఓ యువతి హర్షసాయిపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఆరోపించింది. రూ.2 కోట్ల రూపాయలు సైతం తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో హర్షసాయిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి హర్షసాయి కోసం పోలీసులు గాలిస్తున్నాయి. ఏ క్షణమైనా ఆయన అరెస్ట్ అవుతాడన్న ప్రచారం సాగింది. అయితే.. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఆయనకు ఊరట లభించింది. దీంతో ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. 
ఇది కూడా చదవండి: డ్రగ్ టెస్ట్ కు రేవంత్.. కేటీఆర్ తరఫున వాదిస్తా.. రఘునందన్ సంచలనం

హర్షసాయి విషయానికి వస్తే.. అందరూ డబ్బులు సంపాదించడానికి యూట్యూబ్ వీడియోలు చేస్తే .. కానీ హర్ష సాయి మాత్రం డబ్బులను పంచుతూ వీడియోలు చేసేవాడు. తన యూట్యూబ్ మనీతో పేద వారికీ లక్షల రూపాయలు సాయం చేయడం, తన సబ్ స్క్రైబర్ల కోసం ఏకంగా ఫ్రీ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తూ అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయ్యాడు. 2018లో యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన హర్ష సాయి మొదటగా లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్ కు సంబంధించిన వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత రూట్ మార్చిన హర్ష సామజిక సేవ చేయడం మొదలు పెట్టాడు. అనంతరం సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ గా మారాడు.

Also Read :  బాలయ్య ఫ్యాన్స్ కు నిర్మాత క్షమాపణలు.. 'NBK109' టైటిల్ అప్డేట్ లేదా?

Also Read :  తొలిసారిగా మహిళా వ్యోమగామిని అంతక్షంలోకి పంపిన చైనా..

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Revanth Reddy : రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రముఖ కంపెనీ బిగ్ షాక్.....యూనిట్‌ ఏర్పాటుపై వెనక్కి.....

రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ బీవైడీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను సంస్థ ఖండించింది. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది.

New Update
Byd Electric Cars

Byd Electric Cars

Revanth Reddy : రేవంత్ రెడ్డి సర్కారుకు చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ కంపెనీ బీవైడీ (BYD) బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నట్లు వచ్చిన వార్తలను బీవైడీ సంస్థ ఖండించింది. హైదరాబాద్‌లో ప్లాంట్ ఏర్పాటుపై ప్రస్తుతం ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేమని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.హైదరాబాద్‌లో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనే విషయంపై ఇంకా ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని సంస్థ ప్రకటించింది.

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

బీవైడీ సంస్థ ఇప్పటికే భారత్‌లో తన కార్యకలాపాలు సాగిస్తున్నప్పటికీ, ఇక్కడ సొంత ఉత్పత్తి యూనిట్ లేదు. ప్రస్తుతం చైనాలో ఉత్పత్తి చేసిన కార్లను దిగుమతి చేసుకోవడం వల్ల అధిక సుంకం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో.. భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలని కంపెనీ కొంతకాలంగా యోచిస్తోంది. దీంతో హైదరాబాద్‌లో యూనిట్‌ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం బీవైడీతో చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే.. 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్ సమీపంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వైరలయ్యాయి. కాగా.. ఈ కథనాలు సంస్థ దృష్టికి వెళ్లటంతో.. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది.

ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!

ప్రపంచంలోనే నెంబర్ వన్ ఈవీ సంస్థ అయిన బీవైడీ.. హైదరాబాద్‌‌లో భారీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైందని.. సుమారు రూ.70 వేల కోట్లతో ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. బీవైడీ కంపెనీ పెట్టుబడితో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని కూడా ప్రచారం జరిగింది. అంతేకాకుండా.. ఈ కంపెనీ హైదరాబాద్‌కు వస్తే.. దేశీయ ఈవీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కూడా అందరూ ఆలోచించారు. కాగా.. ఈ వార్తలను బీవైడీ కంపెనీ పూర్తిగా ఖండించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

అయితే, ఈ వార్తలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. గతంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ ఫలితంగానే బీవైడీ  లాంటి సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఈ ప్లాంట్ రాష్ట్రానికి రావడంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర కీలకమని, దీని కోసం చాలా సంవత్సరాలు కృషి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే బీవైడీ తన నిర్ణయంపై స్పష్టత ఇవ్వనప్పటికీ.. భవిష్యత్తులో కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇది కూడా చూడండి: బోణీ కొట్టిన ముంబై..ఐపీఎల్ లో మరో రికార్డ్

Advertisment
Advertisment
Advertisment