Heavy rains : మండుతున్న ఎండలకు కూల్‌ న్యూస్‌...నాలుగు రోజులు భారీవర్షాలు

ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్‌న్యూస్‌. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భూఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

New Update
ap rains

Heavy rains

Heavy rains : ఎర్రటి ఎండలతో ఉక్కిరిబిక్కరవుతోన్న ప్రజలకు కూలింగ్‌న్యూస్‌. రానున్న నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. భూఉపరితలం వేడెక్కడంతో పాటు ద్రోణి ప్రభావంతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
 ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుసంధానంగా ద్రోణి ప్రభావం కూడా ఉంది.

Also Read: ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల మీదుగా మరో ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని IMD తెలిపింది. వచ్చే నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశముంది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశముంది. 

ఇది కూడా చూడండి: ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌!

 మరోవైపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చింది. ఇక ద్రోణి ప్రభావంతో 2 నుంచి 4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షసూచన ఉన్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.  

Also Read: Former Union Minster Girija Vyas:దేవుడి హారతి మంటలు అంటుకుని తీవ్ర గాయాలపాలైన మాజీ కేంద్ర మంత్రి

 తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లలో వడగండ్ల వాన కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌ సహా మిగతా ప్రాంతాల్లోనూ వర్షాలు పడుతాయని.. జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అటు ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని సూచించింది.

Also Read: ఏప్రిల్‌లో ఫోన్ల జాతర.. బ్రాండెడ్ మోడల్స్ వచ్చేస్తున్నాయ్-ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime:  గోల్కొండలో ఘోరం.. బావను చంపిన బామ్మర్ది.. గొడవకు కారణం ఇదే!

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీ చేసిన బైక్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి వాటా ఇవ్వలేదని బ్లేడ్‌తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.

New Update
golkonda crime news

golkonda crime news

TG Crime: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. చోరీ చేసిన బైక్‌ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది. దొంగతనంగా ఎత్తుకొచ్చిన బైక్‌ను అమ్మి తనకు వాటా ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. బావను బామ్మార్ది చంపేసిన ఘటన హైదరాబాద్‌ గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. గోల్కొండలో ముఖిత్‌, సమీర్‌ బావ బామ్మర్దులు నివాసం ఉంటున్నారు. ముఖిత్‌ బైక్‌ను   దొంగిలించారు. బైక్‌ అమ్మి డబ్బులు ఇవ్వాలని బామ్మర్ది సమీర్‌కు చెప్పాడు. అయితే.. ఆదివారం ఉదయం టోలిచౌకి నుంచి సెవెన్‌ టూంబ్స్‌ వెళ్లే రోడ్డులో ఉన్న ఓ హోటల్‌ వద్ద ఇద్దరు కలుసుకున్నారు.  డబ్బు ఇచ్చే విషయంలో వాదులాడుకున్నారు. 

ఇది కూడా చదవండి: వయస్సు 50 ఏళ్లు దాటిందా..? రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలో తెలుసా..?

బ్లేడ్‌తో దాడి చేసి...

ఇద్దరు మధ్య మాటామాట పెరిగి అదికాస్తా పెద్ద గొడవకు దారిసింది. ఈ సమయంలో సహనం కోల్పోయిన సమీర్‌.. బావ ముఖిత్‌పై బ్లేడ్‌తో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ముఖిత్‌ అక్కడికక్కడే మరణించారు. చుట్టు పక్క స్థానికుల ఇచ్చిన సమాచారంతో.. ఘటనా స్థలానికి  పోలీసులు చేరుకున్నారు.  అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నాడు. నిందితుడి సమీర్‌ కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నిజంగానే.. కాకరకాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందా?

ts-crime | ts-crime-news | latest-news )

Advertisment
Advertisment
Advertisment