/rtv/media/media_files/2024/11/25/FvdN8tHSs8thT8p8ubZj.jpeg)
MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై చేసిన భూ దందాల వ్యవహారంపై సీఐడీతో విచారణ జరిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. గత పదేళ్లుగా మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ సిరిసిల్ల జిల్లాల్లో భూ దందాలు చేశారని.. ఆయనతో పాటు ఉన్న అనుచరులు కూడా ఈ దందాలు చేసినట్టు ఆరోపణలు చేశారు. కాగా ఇప్పటికే ఫార్ములా ఈ రేసు, లగచర్ల కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్ ఇక్కట్లు పడుతున్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఈ నెల 30న అకౌంట్లోకి డబ్బు జమ!
కేటీఆర్... కలెక్టర్కు సారీ చెప్పు...
ఇటీవల ఓ సభలో కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను అసభ్య పదజాలాలతో దూషించడంపై వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఒక కలెక్టర్ ను పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడం తగదని అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే జిల్లా కలెక్టర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ మంత్రి పీఏ ఇంట్లో ఏసీబీ దాడులు!
ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత పద్దేళ్లు మంత్రిగా ఉన్న కేటీఆర్ సిరిసిల్లలో భారీగా భూ దండాలు చేశారని ఆరోపణలు చేశారు. కేటీఆర్ తో ఆయన అనుచరులు భూదందా, ఇసుక దందా చేశారని.. ఇప్పుడు ఆ దండాలు అన్ని బయటపెడుతారనే భయంతో కలెక్టర్ పై కేటీఆర్ అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. అధికారం ఉందన్న పేరుతో తన అనుచరులకు కేటీఆర్ వందల ఎకరాల భూమిని కట్టబెట్టారని ఆరోపించారు. అనర్హుల చేతికి వెళ్లిన 150 ఎకరాలను కలెక్టర్ వెనక్కి తీసుకుంటున్నారని, ఆయనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలని కోరారు. సిరిసిల్లలో జరిగిన అక్రమాలపై శాఖాపరమైన విచారణ జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి విజ్ఞప్తి చేశారు. మరి ఈ అంశం కేటీఆర్ మెడకు ఉచ్చుల చుట్టుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.
ఇంకొద్ది రోజులకైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరో సంచలనం!
మంత్రి పొంగులేటి తనని.. కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు.
తాను కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. తాను అన్నవి తన సొంత మాటలు కావని.. రాష్ట్రంలో ఉన్న చాలామంది ప్రజలు తమ వద్దకు వచ్చి అంటున్న మాటలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం మారాలి అని రైతులు..రియల్టర్లు, పారిశ్రామిక వేత్తలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. మంత్రి పొంగులేటి తనని.. కేసీఆర్ ఆత్మ అని అంటున్నారు..కేసీఆర్ లేకుంటే పొంగులేటి ఎక్కడ ఉండేవాడని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పుడు పొంగులేటి మంత్రి పదవిలో ఉన్నాడు అంటే..అది కేసీఆర్ వల్లేనని తెలిపారు. కాంగ్రెస్ నాయకులకు వాళ్ల ప్రభుత్వం పై నమ్మకం లేకనే తమ పార్టీ నుండి పదిమంది ఎమ్మెల్యే లను తీసుకెళ్లారని విమర్శించారు. ఇప్పుడు కాకపోయిన ఇంకొద్దిరోజులు కైనా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని... వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం పక్క అని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే తనపై అక్రమ కేసులు పెడుతున్నారని...తనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు కొత్త ప్రభాకర్ రెడ్డి.. తాను కేసులకు భయపడేవాన్ని కాదని తేల్చి చెప్పారు. కచ్చితంగా తాను పారిశ్రామికవేత్తనని.. కానీ డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదన్నారు. సేవ చేయడానికి మాత్రమే వచ్చానని ఆర్టీవీకీ ఆయన తెలిపారు.
ఎర్రబెల్లి బస్తిమే సవాల్
రేవంత్ సర్కార్ పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేశారు. మంత్రి వర్గ విస్తరణ పూర్తి కాగానే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నారు. మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎర్రబెల్లి దయాకర్ రావు చీఫ్ గెస్టుగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. రాసిపెట్టుకోండి.. స్థానిక సంస్థల్లో వార్ వన్ సైడ్.. ఎప్పుడు ఎన్నికలు పెట్టిన సరే.. బీఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమని ఎర్రబెల్లి అన్నారు. సర్వేలన్ని కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్న ఎర్రబెల్లి.. ఎన్నికలు పెట్టి చూడండి .. తమ సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. తాను చెప్పింది నిజం కాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. మొత్తం రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. అందులో కేవలం 10 నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్గా ఉందని.. మిగతా చోట్ల బీఆర్ఎస్ పార్టీ గెలుస్తోందని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం బయటపడుతోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
Sisters commit suicide : ఎంత కష్టమొచ్చిందో.. పురుగుల మందు తాగి అక్క చెల్లెలు ...
🔴Live News Updates: న్యూస్ అప్డేట్స్
పశ్చిమ బెంగాల్లో హింస వెనుక ముఖ్యమంత్రి కుట్ర : కేంద్ర మంత్రి
MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్