దీపావళి రోజే కేటీఆర్‌పై బాంబ్‌?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పినట్లు దీపావళి రోజు పొలిటికల్ బాంబ్ పేలనుందా? KTR టార్గెట్ గా ఆ బాంబ్ బ్లాస్ట్ కానుందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నకు అవును అనే సమాధానం వినిపిస్తోంది. వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update

తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. దీపావళి రోజు పొలిటికల్ బాంబ్ పడబోతుందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది. ఈ మేరకు ఇప్పటికే రాజ్‌భవన్‌కు సైతం సమాచారం ఇచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తొలి బాంబు కేటీఆర్‌పైనే పడబోతుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ - కార్ రేస్‌ కేసు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏసీబీకి మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేశారు. నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని అధికారులు కోరారు. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలు పాటించకుండా ఫార్ములా ఈ - కార్ రేసు నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ చెల్లించింది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన

గతంలో కేటీఆర్ ఆధ్వర్యంలోనే ఈ MAUD శాఖ ఉండేది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వానికి అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఫార్ములా ఈ - కార్ రేసును రేవంత్ సర్కార్ రద్దు చేసింది. బోర్డు, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు గత ప్రభుత్వం రూ.55 కోట్లు చెల్లించిందని ఆరోపిస్తోంది. ఈ వ్యవహారం నాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి అయిన కేటీఆర్ కు చుట్టుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందన్న చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఏడాదిలో పొలిటికల్ గా కేసీఆర్ ఖతం చేస్తా.. తర్వాత కేటీఆర్.. చిట్ చాట్ లో రేవంత్ సంచలనం

పొంగులేటి బాంబ్ ఇదేనా?

ఇటీవల సియోల్ పర్యటనకు వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలనున్నాయంటూ సంచలన ప్రకటన చేశారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ బాంబులు పేలుతాయన్నారు. అయితే.. ఈ నెల 26న మంత్రివర్గ సమావేశం అనంతరం ఇందుకు సంబంధించిన ప్రకటన ఉంటుందని అంతా భావించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాల్లో బీఆర్ఎస్ ముఖ్యులు అరెస్ట్ ఉంటుందన్న చర్చ సాగింది. అయితే.. అలాంటిదేమీ జరగలేదు. అయితే.. దీపావళిలోగా బాంబు పేలుతుందని పొంగులేటి మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అయితే.. ప్రస్తుతం ఫార్ముల ఈ-కార్ రేసు కేసు వ్యవహారంలో ఏసీబీ దూకుడు చూసి పొలిటికల్ బాంబ్ ఇదేనన్న చర్చ సాగుతోంది.   

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Hyderabad: మీరు ఐస్ క్రీమ్‌ ఎక్కువగా తింటారా..అయితే 3 లక్షలు మీ సొంతం!

హైదరాబాద్‌లో ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోని ప్రీమియా మాల్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగుతాయి.

New Update
ice cream

ice cream

ఐస్‌క్రీమ్ ప్రియులకు ఒక ప్రత్యేకమైన పోటీ వేదిక రాబోతుంది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ రకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తిస్తే చాలు.. ఏకంగా రూ. 3 లక్షల వరకు నగదు బహుమతులు గెలుచుకునే అవకాశం మీ కోసం రెడీ అవుతుంది. ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మూడవ ఎడిషన్ ఈ నెల 27న ఐస్‌క్రీమ్ అభిమానుల ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన వివరాలను  ఎర్రమంజిల్‌లోని గలేరియా మాల్‌లో ప్రముఖ హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌, బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతావర్మ,  నటుడు సమీర్‌లు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పోటీ  పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ ఆసక్తికరమైన పోటీలో విజేతలకు భారీ నగదు బహుమతులు అందజేయనున్నారు.

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

మొదటి బహుమతిగా రూ. లక్ష, రెండవ బహుమతిగా రూ. 50 వేలు,  మూడవ బహుమతిగా రూ. 25 వేలు గెలుచుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా.. మరో 25 మంది విజేతలను ఎంపిక చేసి, ఒక్కొ విజేతకు రూ. 5 వేల చొప్పున కన్సోలేషన్ బహుమతులు కూడా నిర్వాహకులు ఇవ్వనున్నారు.

 ఈ పోటీలు ఎర్రమంజిల్‌ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్‌లో ఈ నెల 27న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ తారలు స్వయంగా కళ్లకు గంతలు కట్టుకుని వివిధ ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తించే ప్రయత్నం చేశారు.. ఇది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 8008574747 నెంబర్‌లో సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఐస్‌బర్గ్‌ ఐస్‌క్రీమ్స్ సీఈఓ సుహాస్‌ బి. శెట్టి, ఒక ప్రముఖ తెలుగు ఛానెల్ ఎండీ ఎం. రాజ్‌గోపాల్ , డాక్టర్ జె. సంధ్యారాణి వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పోటీ కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా.. ఐస్‌క్రీమ్ రుచులను గుర్తించడంలో మీ నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ప్రత్యేకమైన వేదికగా కూడా నిలవనుంది. 

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Also Read: America: వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ.86 వేలు కట్టండి..!

hyderabad | ice-cream | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment