Raj tarun: రాజ్‌తరుణ్‌ లవ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు!

నటుడు రాజ్ తరుణ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. లావణ్యకు రాజ్ తో పెళ్లికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని సూచించింది.

New Update
Raj tarun: రాజ్‌తరుణ్‌ లవ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు!

Raj tarun- lavanya: న‌టుడు రాజ్ త‌రుణ్‌- లావణ్య లవ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. రాజ్ తనను మోసం చేశాడంటూ లావ‌ణ్య నార్సింగి పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టిన విష‌యం తెలిసిందే. కాగా ఈ కేసులో రాజ్ తరణ్‌ కు తెలంగాణ‌ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో గురువారం విచార‌ణ జ‌రిపిన న్యాయ‌స్థానం అత‌డికి ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే.. రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan : టార్గెట్ అల్లు అర్జున్.. పుష్ప క్యారెక్టర్‌పై పవన్ కల్యాణ్ డైరెక్ట్ అటాక్!

ఇక లావణ్యకు హైకోర్టు కీకల ఆదేశాలు జారీ చేసింది. రాజ్ తరుణ్‌ తో పెళ్లి జరిగినట్లు ఆధారాలు కావాలని అడిగింది. లావణ్య చూపించకపోవడంతో కనీసం పెళ్లి శుభలేఖ అయినా ఉందా అని ధర్మాసనం అడిగింది. అయితే ఆధారాలు సేకరించేందుకు తమకు సమయం కావాలని లావణ్య తరపు న్యాయవాది కోరాడు. ఈ క్రమంలోనే రాజ్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. గతంలో లావణ్య ట్రాక్‌ రికార్డు సరిగా లేదన్నారు. హీరో రాజ్‌తరుణ్‌ 30కి పైగా సినిమాలు చేశాడని, అతనిపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. లావణ్య ఆధారాలు లేకుండా కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్

మాచో స్టార్ గోపీచంద్ కొత్త మూవీని అనౌన్స్ చేశారు. SVCC బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈరోజు పూజ కార్యక్రమాలతో మూవీని లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update

Gopichand టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ SVCC(శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర)  బ్యానర్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గోపీచంద్ సూపర్ హిట్  'సాహసం' తర్వాత రెండోసారి ఈ నిర్మాణ సంస్థతో చేతులు కలిపారు. SVCC 39వ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. ఈ సందర్భంగా ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిర్మాతలు BVSN ప్రసాద్, బాపీనీడు, గోపిచంద్ తదితరులు పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మలయాళ నటి హీరోయిన్ గా 

కుమార్ సాయి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇందులో గోపిచంద్ సరసన కథానాయికగా మలయాళ నటి మీనాక్షి దినేష్ నటిస్తోంది. మే లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాలోని ఇతర నటీనటుల విషయాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.

latest-news | cinema-news | actor-gopichand 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
Advertisment