Raghunandan Rao: మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు హైకోర్టు షాక్‌

TG: మాజీ MLA రఘునందన్‌ రావుకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఇటీవల సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారని ఈసీకి రఘునందన్‌ ఫిర్యాదు చేయగా.. 106 ఐకేపీ, EGS ఉద్యోగులను ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వారిని విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

New Update
Raghunandan Rao: మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావుకు హైకోర్టు షాక్‌

EX MLA Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌ రావుకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఇటీవల సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌కు హాజరయ్యారని ఈసీకి రఘునందన్‌ ఫిర్యాదు చేయగా.. 106 ఐకేపీ, EGS ఉద్యోగులను ఆ జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. తాజాగా వారిని విదుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అసలేమైంది.. ఈ నెల 9వ తేదీన సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లఘించారని 106 మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేశారు ఆ జిల్లా కలెక్టర్ మను చౌదరి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభలో పాల్గొనడంపై ఎన్నికల కమిషన్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.

ALSO READ: బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల కమిషన్ వారిని వెంటనే విధుల్లో నుంచి తొలిగించాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇవ్వగా.. 106 మంది ప్రభుత్వ ఉద్యోగుల సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఇదే విషయంపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. రఘునందన్ రావు రాసిన లేఖపై స్పందించిన ఈసీ ఉద్యోగులను వెంటనే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చింది.

సస్పెండ్ చేయబడ్డ వారు.. సెర్ప్ ఉద్యోగులు 38 మంది. వారిలో ఏపీఎంలు-14,సీసీలు-18, వివోఏలు-4,సిఓ-1,సిబి ఆడిటర్స్-1. అలాగే 68 మంది ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో ఏపీవోలు-4,ఈసీలు -7, టిఏలు-38,సిఓలు-18,ఎఫ్ఎ-1 ఉన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack: పెళ్లయిన 6 రోజులకే ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన నవ వధువు..

జమ్మూకశ్మీర్‌లో వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
Pahalgam Attack

Pahalgam Attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. టీఆర్‌ఎఫ్‌ ఉగ్రవాదుల కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో  లెఫ్టినెంట్ వినయర్‌ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే  ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్‌.. ప్రస్తుతం కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. 

Also Read: నలుగురు టెర్రరిస్టులను గుర్తుపట్టిన భద్రతా బలగాలు

ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్‌ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది. భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Also Read: పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

ఇదిలాఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

Also Read: పహల్గామ్ అటాక్ సూత్రధారి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా సాజిద్ జట్!

 telugu | Pahalgam attack

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు