BIG BREAKING: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. బీజేపీ మేనిఫెస్టో!

తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

New Update
BIG BREAKING: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. బీజేపీ మేనిఫెస్టో!

Telangana Elections 2023: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ మేనిఫెస్టోను ప్రకటించి ప్రచారాల్లో దూసుకుపోతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను కేంద్రహోం మంత్రి అమిత్ షా విడుదల చేశారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ అనే పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు.

తెలంగాణను ప్రగతి పథంలో నడిపేందుకు దశ(10) అంశాల కార్యాచరణతో రూపొందించిన బీజేపీ మేనిఫెస్టో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

* ప్రజలందరికీ సుపరిపాలన.. సమర్థవంతమైన పాలనపై దృష్టి
* అవీనితిని ఉక్కుపాదంతో అణచివేయడంతోపాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్' నినాదంతో సుపరిపాలన
* ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించడం ద్వారా పెట్రోల్ ఉత్పత్తుల ధరల తగ్గింపు
* ధరణి వ్యవస్థ స్థానంలో పారదర్శకమైన 'మీ భూమి' వ్యవస్థ
* కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా అమలు చేయడం కోసం ప్రత్యేక నోడల్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు
* తెలంగాణ గల్ఫ్ నివాసితుల సంక్షేమం కోసం ప్రత్యేక నోడల్ విభాగం
* ఉద్యోగస్తులు, పింఛనర్లకు ప్రతినెలా 1వ తేదీనే వేతనాలు
* బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో చేసిన కుంభకోణాలన్నింటిపై విచారణ కమిటీని ఏర్పాటు. దోషులు న్యాయస్థానం ముందుకు
* వరికి రూ.3100 మద్దతు ధర, ప్రతీ రైతుకు దేశీయ ఆవు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anakapalli Fire Accident: అనకాపల్లిలో దారుణం.. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు- స్పాట్‌లో 5గురు మృతి

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది.

New Update
Fire Accident  in america

Fire Accident in Anakapalli Kailasapatnam

అనకాపల్లిజిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

AP Inter Students Suicide

ఇదిలా ఉంటే ఇవాళ ఏపీలో మరికొన్ని విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు దారుణమైన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా కొండపేటకు చెందిన చరణ్ తేజకు సెకండియర్ ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

ఇదిలా ఉంటే .. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్ అనే విద్యార్థి కూడా జీవితాన్ని అర్థారతంరంగా ముగించుకున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని, సమాజంలో ఉన్న అణచివేత వాతావరణానికి అద్దం పడుతున్నాయి.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు సబ్జెక్టుల్లో ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనలు చూస్తే, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సమాజం, విద్యా సంస్థలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంత ఉందో తెలుస్తోంది.

(fire accident | anakapalli | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment