Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట!

2018 గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీనిపై గంగుల స్పందిస్తూ.. తన ఎన్నిక విషయంలో చివరికీ న్యాయమే గెలిచిందంటూ హర్షాన్ని వ్యక్తం చేశారు.

New Update
Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు హైకోర్టులో ఊరట!

మంత్రి గంగులకమలాకర్(Gangula Kamalakar)కు తెలంగాణ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 2018లో కరీంనగర్ ఎమ్మేల్యేగా గంగుల కమలాకర్ పరిమితికి మించి ఖర్చు చేశారని ఎన్నిక రద్దు చేయాలనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar). దీనిని విచారించిన ధర్మాసనం సరైన ఆధారాలు లేవంటూ పొన్నం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ ఎన్నిక చెల్లుతుందని ప్రకటించి పొన్నంకు షాక్ ఇచ్చింది. మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) కూడా గంగుల ఎన్నికను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరపనుంది.

Also Read: విద్యార్థులకు GOOD NEWS.. సెలవులు పెంపు!

కోర్టు తీర్పుపై మంత్రి గంగుల రియాక్షన్:

ఎన్నికల నామినేషన్ పర్వం కొనసాగుతోంది. ఈరోజు కరీంనగర్ నుంచి పోటీ చేసే బిఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ చేసేందుకు మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ వేశారు. అనంతరం తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన స్పందించారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ.." తాను నామినేషన్ వేసేరోజే హైకోర్టు తనకు ఫెవర్‌గా తీర్పు ఇవ్వడం శుభసూచకం అని హర్షం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల్లో ప్రజల మద్దతుతో తానుగెలిచానని.. అది ఓర్వలేక ప్రతిపక్షాలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని గంగుల మండిపడ్డారు. తన విషయంలో న్యాయమే గెలిచిందని అన్నారు. కరీంనగర్ ప్రజల ఆశీర్వాదాలతో ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళాను అని అన్నారు. కరీంనగర్ ప్రజలకు జీవితాంతం అండగా ఉంటానని తెలిపారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్, కాంగ్రెస్ తరఫున పురుమళ్ల శ్రీనివాస్, బీజేపీ తరఫున బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు.

Also Read: కేసీఆర్ కు తప్పిన ప్రమాదం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

J&K : వారిని వదిలిపెట్టేదే లేదు..ఉగ్రదాడిపై నేతల రియాక్షన్

జమ్మూలోని పహల్గామ్ లోని ఉగ్రదాడిపై ప్రధాన మోదీ, రాష్ట్రపతితో పాటూ నేతలందరూ స్పందించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలిపెట్టేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

New Update
attack jammu

attack jammu

జమ్మూలో జరిగిన టెర్రరిస్ట్ అటాక్ యావత్ దేశాన్ని షాక్ లో పడేసింది. అమాయక టూరిస్టులు చనిపోవడంపై నేతలు అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..కేంద్రహోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇందులో మృత చెందిన వారికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అత్యంత హేయమైన పనికి ఒడిగట్టినవారిని చట్టం ముందుకు తీసకువస్తామని...వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మోదీ చెప్పారు. టెర్రరిస్టుల ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని...వారిపై పోరాడాలన్న సంకల్పం మరింత ధృడమైందని ప్రధాని అన్నారు. దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

పహల్గాం ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని రాష్ట్ర పత్రి అన్నారు.ఇదొక క్రూరమైన, అమానవీయ చర్యలను చెప్పారు. అమాయక పౌరులను చంపేయడం క్షమించరానిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పోస్ట్‌ చేశారు.

సీఎం చంద్రబాబు..

టెర్రరిస్టుల దాడి ఘన తీవ్ర ఆవేదన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమాయకులైన పర్యాటకులపై పాశవిక చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ తెలిపారు. 

సీఎం రేవంత్ రెడ్డి..

పహల్గామ్ అటాక్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుశ్చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దొంగదెబ్బ తో  భారతీయుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన చెప్పారు. ఈ దాులపై పరభత్వం వెంటనే చర్యలు తీసుకోవాని...వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని రేవంత్ కేంద్రాన్ని కోరారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆయన కోరారు. 

కిషన్ రెడ్డి..

ఉగ్రవాదుల దాడి తనను కలిచి వేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతి మొత్తం ఏకతాటిపై ఉంటుంది. అమాయక పౌరులపై ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య అన్నారు. జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడి ఘటన పట్ల కలతచెందినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. 

గజేంద్ర సింగ్ షెకావత్..

ఉగ్రదాడి ఒక పిరికిపంద చర్య అన్నారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. ఈ కిరాతక దాడికి పాల్పడిన వారు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

today-latest-news-in-telugu | jammu | terror-attack | leaders | pm modi 

Also Read: ’పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు‘

Advertisment
Advertisment
Advertisment