YS Jagan : జగన్కు బాలకృష్ణ బిగ్ షాక్ AP: వైసీపీ అధినేత జగన్కు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షాక్ ఇచ్చారు. హిందూపురంలో మున్సిపల్ చైర్పర్సన్తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. త్వరలో మరికొంత మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 17 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి TDP MLA Balakrishna: హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్పర్సన్తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ-30, టీడీపీ-6, బీజేపీ-1, ఎంఐఎం-1 చొప్పున విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 2, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు. టీడీపీకి మరో వైసీపీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ బలం 20కి చేరింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కోరం ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిసి బలం 22కి చేరింది. త్వరలోనే అధికారికంగా చైర్మన్ ఎన్నిక జరగనుంది. పార్టీ వీడిన వారిని వైసీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ సస్పెండ్ చేశారు. కాగా ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ కు ఇదే బిగ్ షాక్ అనే చెప్పాలి. హిందూపురంలో వైసీపీ ఖాళీ అవ్వబోతుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. అంతే కాకుండా ఏపీలో వైసీపీ కనుమరుగు అవ్వడం ఖాయమని కూటమి నేతలు అంటున్నారు. Also Read : ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ! #ap-ycp #ys-jagan #balakrishna సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి