YS Jagan : జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్

AP: వైసీపీ అధినేత జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ షాక్ ఇచ్చారు. హిందూపురంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బాలకృష్ణ. త్వరలో మరికొంత మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.

New Update
YS Jagan : జగన్‌కు బాలకృష్ణ బిగ్ షాక్

TDP MLA Balakrishna: హిందూపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మున్సిపల్ చైర్‌పర్సన్‌తో సహా 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో వైసీపీ-30, టీడీపీ-6, బీజేపీ-1, ఎంఐఎం-1 చొప్పున విజయం సాధించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి 2, బీజేపీ, ఎంఐఎం కౌన్సిలర్లు టీడీపీలోకి జంప్ అయ్యారు.

టీడీపీకి మరో వైసీపీ కౌన్సిలర్ మద్దతు ఇచ్చారు. దీంతో టీడీపీ బలం 20కి చేరింది. మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికకు కోరం ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిసి బలం 22కి చేరింది. త్వరలోనే అధికారికంగా చైర్మన్ ఎన్నిక జరగనుంది. పార్టీ వీడిన వారిని వైసీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ సస్పెండ్ చేశారు. కాగా ఎన్నికల్లో ఓటమి తరువాత జగన్ కు ఇదే బిగ్ షాక్ అనే చెప్పాలి. హిందూపురంలో వైసీపీ ఖాళీ అవ్వబోతుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. అంతే కాకుండా ఏపీలో వైసీపీ కనుమరుగు అవ్వడం ఖాయమని కూటమి నేతలు అంటున్నారు.

Also Read : ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. నేడు మోదీతో కీలక భేటీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini Love: ఓరి మీ దుంపల్‌తెగ ఆపండ్రోయ్.. అఘోరీ కోసం వర్షిణీ లవ్ సాంగ్- వీడియో

శ్రీవర్షిణి కొన్ని పాటలను లేడీ అఘోరీకి డెడికేట్ చేసింది. మళ్లీ తాను అఘోరీ చెంతకు చేరుకున్న ఆనందంలో పాటలు పాడింది. మెల్లగ కరగనీ రెండు మనసుల దూరం అంటూ ప్రభాస్ వర్షం మూవీలోని సాంగ్‌ను పాడి అఘోరీకి డెడికేట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.

New Update

అఘోరీ - శ్రీవర్షిణీ ఎపిసోడ్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు ఓ రేంజ్‌లో నడిచిన వీరి కథ.. ఇప్పుడు మరో మలుపు తిరిగింది. వీరిద్దరూ వీరి నాలుగు నెలల ప్రేమ బంధానికి గుర్తుగా పెళ్లి చేసుకున్నారు. అయితే అది ఒకసారి కాకపోవడం గమనార్హం. వేరు వేరు ప్రాంతాల్లో రెండు సార్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య వర్షిణీని అఘోరీ బంగారు చైన్‌ వేసి పెళ్లాడింది. ఈ విషయాలన్నీ స్వయంగా వర్షిణీనే బయటపెట్టింది. 

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

అంతేకాకుండా ఇటీవలే గుజరాత్ నుంచి వచ్చి ఫ్యామిలీ దగ్గర ఉన్న వర్షిణీ ఇప్పుడు మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. తమను ఎవరూ విడదీయలేరని అంటోంది. తమ ప్రేమకు గుర్తుగా పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది. అఘోరీలో జెన్యుటీని చూసి ఇష్టపడ్డానని అంటోంది. అఘోరీతో సె**క్స్‌ను తాను కోరుకోలేదని.. సె**క్స్ కోరికలు తనకు లేవని తెలిపింది. ఇందులో భాగంగానే RTV ఛానెల్‌తో ఇచ్చిన లైవ్ ఇంటర్వ్యూలో అఘోరీపై ప్రేమను కురిపించింది. 

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

అఘోరీ కోసం స్పెషల్ సాంగ్ 

అఘోరీ అంటే తనకు ఎంత ఇష్టం..? ఎందుకు ఇష్టమో తెలిపింది. అంతేకాదండోయ్.. అఘోరీ కోసం ఏకంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ పాటలను డెడికేట్ చేసింది. అఘోరీ - వర్షిణీ ఇద్దరూ కారులో ఉండి లైవ్ ఇచ్చారు. అందులో అఘోరీ కోసం వర్షిణీ కొన్ని పాటలు పాడింది. పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ మూవీలోని వీడు ఆరడుగుల బుల్లెట్టు అంటూ ఓ సాంగ్ పాడింది. ఆ తర్వాత.. ప్రభాస్ ‘వర్షం’ మూవీలోని మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం అంటూ ఓ సాంగ్ పాడింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

(aghori | lady aghori sri varshini relation | sri varshini | Aghori Sri Varshini Lov | aghori sri varshini | latest-telugu-news | telugu-news)

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment