AP Politics: జగన్ పై దాడి.. ఓ జగన్నాటకం: మాజీ మంత్రి సోమిరెడ్డి

ఓడిపోతామన్న భయంతోనే జగన్ మోహన్ రెడ్డిపై దాడిం అంటూ వైసీపీ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పై రాళ్ళ దాడి వెనుక జగన్నాటకం దాగి ఉందన్నారు.

New Update
AP Politics: జగన్ పై దాడి.. ఓ జగన్నాటకం: మాజీ మంత్రి సోమిరెడ్డి

జగన్మోహన్ రెడ్డి పై రాళ్ళ దాడి వెనుక జగన్నాటకం దాగి ఉందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సానుభూతి కోసం జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుకున్నాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పై చిన్న గులక రాయి విసిరారన్నారు. గతంలో కోడి కత్తి నాటకం ఆడాడని.. ఇప్పుడు గులక రాయి నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పై కూటమి కుట్ర అని చెప్పడానికి వైసీపీకి సిగ్గు కూడా లేదని ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భయపడే ఈ నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. సోమిరెడ్డి పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు