Ap Politics : నీ సర్వే నిజం అయితే... నాలుక కోసుకుంటా అంటూ ఆరా మస్తాన్ కి బుద్దా ఛాలెంజ్! గ్జిట్ పోల్స్ సర్వేలో వైసీపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్ చేసిన సర్వే అంత ఫేక్ అని దానిని ఎవరూ నమ్మోద్దని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ కి బుద్దా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. By Bhavana 02 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి TDP Leader Buddha Venkanna : ఎగ్జిట్ పోల్స్ సర్వే (Exit Polls Survey) లో వైసీపీ (YCP) అత్యధిక సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్ (AARA MASTAN) చేసిన సర్వే అంత ఫేక్ అని దానిని ఎవరూ నమ్మోద్దని టీడీపీ నేత బుద్దా వెంకన్న (Buddha Venkanna) అన్నారు. ఈ సందర్భంగా ఆరా మస్తాన్ కి బుద్దా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నీ సర్వే నిజం అయితే...నేను నాలుక కోసుకుంటానని...నీ సర్వే తప్పు అయితే నీ నాలుక కోసుకుంటావా అని బుద్దా ఛాలెంజ్ చేశారు. ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకనే అసెంబ్లీలో అడుగుపెడతా అని ఛాలెంజ్ చేసారు.. జగన్ మోహన్ రెడ్డి ఓడిపోతే అసెంబ్లీ లో అడుగు పెట్టనని చెప్పే దమ్ముందా..ఆరా మస్తాన్ సర్వే ఫేక్ సర్వే... అధికారులు అంతర్గతంగా మేనేజ్ చేయాలి అనే సంకేతం ఇచ్చేలా ఆరా మస్తాన్ సర్వే ఉందని బుద్దా ఆరోపించారు. బెట్టింగ్ లు అన్నీ టీడీపీ వైపు కాయడానికి, వైసీపీ బెట్టింగ్ లన్నీ వాళ్ళే కాస్తారAARని బుద్దా పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చును రాబట్టుకోవడానికి బెట్టింగ్ రూపంలో ఆరా మస్తాన్ తో ఆడిస్తున్న మైండ్ గేమ్.. ఎవరూ ఆరా మస్తాన్ సర్వే నమ్మొద్దు అంటూ బుద్దా పేర్కొన్నారు. Also read: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం…స్పాట్ లోనే ఇద్దరు మృతి! #aara-mastan-survey #buddha-venkanna #ycp #tdp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి