Sajjala: షర్మిలకు మాఫియా ముఠాతో సంబంధాలున్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్!

షర్మిలపై సజ్జల రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాఫియా ముఠా టీడీపీ, చంద్రబాబుతో కలిసి పనిచేస్తుందన్నారు. ఆమెకు స్క్రిప్ట్ ఎక్కడ నుంచి వస్తుందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. వారంతా నోటాతో పోటీ పడేందుకు జత కట్టారని విమర్శించారు.

New Update
Sajjala: షర్మిలకు మాఫియా ముఠాతో సంబంధాలున్నాయి.. సజ్జల సంచలన కామెంట్స్!

Sajjala Comments On Chandrababu & Sharmila: టీడీపీ పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామ కృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని ఒక మాఫియా ముఠాగా పేర్కొన్నారు. అంతేకాదు చంద్రబాబును ప్రజలు చీ కొట్టినా బుద్ధిరాలేదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

వెన్నతో పెట్టిన విద్య..
ఈ మేరకు దేశంలో అన్ని వ్యవస్థలను శాసించడం మొదటి నుంచి చంద్రబాబుకు అలవాటు అని సజ్జల అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అలాగే చంద్ర బాబు అంటే గుర్తొచ్చేది వ్యవస్థలను మేనేజ్ చేయడమే. మీడియాను అడ్డం పట్టుకునే ఉవ్వెత్తున అసత్య ప్రచారాలు చేయడంలో దిట్టా. అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవడం చంద్ర బాబుకు అలవాటే. పార్టీని మాఫియా ముఠాలాగ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని నడిపాడు. నలభై ఏళ్ల అనుభవం తరువాత చంద్ర బాబు చేసిన అవినీతి ఆయనకు మిగిలింది. రాజకీయ జీవితంలో సమాంతరంగా అవినీతిని బ్యాలెన్స్ చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి: Railway Property : ఇదేం పాడు బుద్ధి.. ఈ మొగుడు నాకొద్దు.. ఓ ఇంజనీర్ భార్య నిజాయితీ!

ప్రజలు చీ కొట్టి తరిమేసినా..
ఇక కేంద్ర నిధుల నుంచి రాష్ట్ర నిధుల వరకు ఎదో ఒక పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అమరావతి కూడా ఒక పెద్ద స్కాం.
ప్రజలు చీ కొట్టి తరిమివేసిన తన వైఖరిని చంద్రబాబు ఇప్పటికీ మార్చుకోలేదు. ఎవరు ఎలా వచ్చినా ఎంత మంది వచ్చినా ఎన్నికల యుద్దానికి సిద్దంగా ఉన్నామని సిఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) ప్రకటించారు. బీజేపీ, జనసేనతో పాటు నోటాతో పోటీ పడే కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు జత కట్టారు. అవుట్ సోర్సింగ్ లాగ అన్ని పార్టీల మద్దతు కూడా గట్టుకొని పొత్తులతో వస్తున్నారు. వైఎస్ షర్మిల కూడా చంద్రబాబుతో కలిసి పని చేస్తున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ (Congress) పార్టీ అధ్యక్షురాలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. వైఎస్ షర్మిలకు స్క్రిప్ట్ ఎక్కడ నుంచి వస్తుందో రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారని చెప్పారు. అట్టడుగున ఉన్న అన్ని వర్గాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారంటూ ఈసారి కూడా వైసీపీ (YCP) ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ntr District కారు భీభత్సం .. ఏడుగురు అడ్డాకూలీలు పైకి దూసుకెళ్లింది..

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కారు భీభత్సం సృష్టించింది. చెరువు బజారు కట్ట వద్ద ఏడుగురు కూలీలు అందరు నిలబడి ఉండగా.. వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కారు యాక్సిడెంట్

Ntr District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు అడ్డాకూలీలపైకి కారు దూసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. అయితే మేస్త్రీ పని చేయడానికి వచ్చిన  అడ్డాకూలీలు ఉదయం బజారు చెరువు కట్ట సర్కిల్ వద్ద నిలబడి ఉండగా.. అతి వేగంగా వచ్చిన కారు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం  క్షతగాత్రులను వెంటనే జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి  తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. ప్రస్తుతం కారును సీజ్ చేయగా.. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఎమ్మెల్యే పరామర్శ.. 

ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే  శ్రీరాం రాజగోపాల్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకొని గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గాయపడిన వారిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపవలసిందిగా డాక్టర్ కు సూచించారు.  గాయపడిన వారిలో ఓర్సు రామకృష్ణ, బత్తుల వెంకట గురువులు తీవ్రంగా గాయపడినట్లు వైద్యులు తెలిపారు. 

telugu-news | latest-news | ntr-district

Advertisment
Advertisment
Advertisment