YCP - TDP: వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు..! కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు వెలిశాయి. శరత్ థియేటర్లో భాగస్వామ్యులను బెదిరించి మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారడంతో థియేటర్ భాగస్వామి యువసేన.. చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం అంటూ ఫ్లెక్సీలు పెట్టాడు. By Jyoshna Sappogula 21 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Krishna District: కృష్ణా జిల్లా గుడివాడ వైసీపీ కార్యాలయ భవనంపై టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శరత్ థియేటర్లో ఎనిమిదేళ్ల క్రితం వైసీపీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. అయితే, థియేటర్ కాలి చేయాలని అనేకసార్లు భాగస్వామ్యులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికి భాగస్వామ్యులపై మాజీ మంత్రి కొడాలి నాని బెదిరింపులకు దిగడంతో వారు చేసేదేమి లేక సైలంట్ అయిపోయారు. Also Read: అధికారులపై పవన్ సీరియస్.. నిధుల మళ్లింపుపై క్లారిటీ ఇవ్వాలని ఆదేశం..! థియేటర్ భాగస్వామి గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి యువసేన. ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీ ఫ్లెక్సీలు తీసేశారు. తాజాగా, చంద్రన్న అసెంబ్లీలోకి పునరాగమనం.. కానున్నది ఆంధ్రరాష్ట్రం స్వర్ణయుగం అంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత ఎనిమిదేళ్లగా వైసీపీ ఫ్లెక్సీలతో ఉన్న ఈ కార్యాలయం టీడీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో నగరంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. #tdp #ycp సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి