AP: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నం తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి ఓటమి భయంతో తనను మట్టుపెట్టడానికి చూస్తున్నాడని ఆరోపించారు. కత్తి పట్టుకొని వచ్చిన వైసీపీ వ్యక్తిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించామన్నారు. By Jyoshna Sappogula 04 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Murder Attempt On Bojjala Sudheer Reddy: తనపై హత్యాయత్నం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. వైసీపీ వ్యక్తులు ముగ్గురు తన వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారని తెలిపారు. అయితే ముగ్గురిలో ఒకరి జోబులో కత్తి ఉందని తెలిపారు. సిటింగ్ ఎమ్మెల్యే ఓటమి భయంతో తనను మట్టుపెట్టడానికి చూస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు సుధీర్ రెడ్డి. కత్తి పట్టుకొని వచ్చిన వ్యక్తిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. తనను చంపితే ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డికి సానుభూతి ఎలా వస్తుంది ? అని ప్రశ్నించారు. మరి ఇంత పిచ్చివాడులా ఉన్నాడని నిప్పులు చెరిగారు. ఈ ఘటనపై పోలీసుల రియాక్షన్ తో పాటు పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. Also Read: టీడీపీలోకి నరసాపురం ఎంపీ.. పోటీపై క్లారిటీ వచ్చే అవకాశం.. #srikalahasti #tdp-candidate-bojjala-sudhir-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి