Film Producers: సినీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం.. ఆ నటీనటులపై చర్యలకు సిద్ధం! అడ్వాన్స్లు తీసుకొని సినిమాలు పూర్తి చేయని నటినటులపై కొరడా ఝులిపించబోతున్నట్లు తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతల మండలి ప్రకటించింది. పెండింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని తీర్మానం చేసింది. నటీనటులు అడ్వాన్స్ తీసుకోవడాన్ని నిషేధించింది. By srinivas 29 Jul 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Tamil Cinema: తమిళ్ సినీ ఇండస్ట్రీ నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అడ్వాన్స్లు తీసుకొని సినిమాలు పూర్తి చేయని నటి నటులపై కొరడా ఝులిపించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆగస్ట్ 15తరువాత కొత్త సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. పెండింగ్లో ఉన్న సినిమాలు పూర్తి చేసిన తరువాతే కొత్త సినిమాల షూటింగ్స్ మొదలు పెట్టాలని తీర్మానం చేసింది. అలాగే పెండింగ్ మూవీలు ఇచ్చిన అడ్వాన్స్ లపై నిర్మాతలను నివేదిక అడిగిన మండలి.. ఇక నుంచి ఒక సినిమా పూర్తయ్యాకే మరో సినిమాకు కాల్ షిట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఇకపై నటీనటులు అడ్వాన్స్ తీసుకోవడాన్ని నిషేధించింది. ఇదిలా ఉంటే.. నటుడు ధనుష్ (Hero Dhanush) తీరుపై నిర్మాతల మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వాన్స్ లు తీసుకొని షూటింగ్స్ పూర్తి చేయడంలేదని ధనుష్ పై ఫిర్యాదులు చేసింది. ఇకనుంచి నిర్మాతల మండలి పర్మిషన్ ఉంటేనే ధనుష్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తీర్మానం చేసింది. ఇది కూడా చదవండి: Ambedkar Statue: కళ తప్పుతున్న భారీ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. నో ఎంట్రీ ఎన్నాళ్లు? #hero-dhanush #tamil-film-industry సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి