మాల్దీవుల్లో మిల్కీ అందాలు! తమన్నా బీచ్ ఒడ్డున నడుస్తూ ఐస్ క్రీమ్ ని ఆస్వాదిస్తుంది. తమన్నా ఇలా ఫోటో పెట్టిందో లేదో అలా వైరల్ అయిపోయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. By Bhavana 04 Sep 2023 in సినిమా వైరల్ New Update షేర్ చేయండి మిల్కీ బ్యూటీ తమన్నా (Tamanna) ప్రస్తుతం మాల్దీవుల్లో సేద తీరుతుంది. ఆమె అక్కడ ఎంజాయ్ చేస్తున్న కొన్ని చిత్రాలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అక్కడ తమన్నా బీచ్ ఒడ్డున నడుస్తూ ఐస్ క్రీమ్ ని ఆస్వాదిస్తుంది. తమన్నా ఇలా ఫోటో పెట్టిందో లేదో అలా వైరల్ అయిపోయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. మాల్దీవులు కంటే తమన్నా చాలా అందంగా కనిపిస్తుందని ఒకరు రాస్తే..గార్జియస్ అంటూ మరోకరు రాసుకొచ్చారు. తమన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా ఆమె తన అభిమానులతో పంచుకుంటుంది. ఆ విధంగానే ఆమె రెండు రోజుల క్రితం మాల్దీవుల్లో సేద తీరుతున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. కొద్ది రోజుల క్రితమే తన ప్రేమ వ్యవహారాన్ని కూడా తమన్నా బయటపెట్టింది. తన సహా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. సమయం వచ్చినప్పుడు ఇద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలిపింది. లవ్ స్టోరీ 2 తో తమన్నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ గురించి చెబుతూ తమన్నా చాలా ఎమోషనల్ కూడా అయ్యింది. అతను చాలా శ్రద్ద వహించే వ్యక్తి. అతనితో ఉంటే నాకు ప్రతి రోజు కూడా సంతోషకరమైనదే అని చెప్పింది. విజయ్ తమన్నా ఇద్దరూ కూడా చాలా కార్యక్రమాలకు కలిసి వెళ్తూ మీడియా కంట చాలా సార్లు పడ్డారు. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. #maldeevs #tamanna సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి