Andhra Pradesh : నేటి నుంచే వైసీపీ ఎన్నికల శంఖారావం
ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
ఆంధ్రాలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ తెర తీసింది. ఈరోజు నుంచే ఆ పార్టీ ఎన్నికల శంఖారావం మోగనుంది. కడపలోని ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది.
ఏపీలో పొలిటికల్ హీట్ రానురాను పెరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇద్దరు నేతలూ రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు.
జయప్రకాష్ నారాయణ ఎన్డీయేకు మద్దతు ఇవ్వడంపై ఫైర్ అయ్యారు పోసాని. చంద్రబాబు తమ కులానికి చెందిన వాడు కాబట్టి జేపీ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దని అన్నారు.
ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు చంద్రబాబు. మొత్తం 5 రోజుల పాటు 'ప్రజాగళం' పేరుతో సభలు, రోడ్ షో లు నిర్వహించనున్నారు. అయితే, 27 నుంచి సీఎం జగన్ కూడా 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సు యాత్రలు చేపట్టనున్న విషయం తెలిసిందే.
శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థి సాంబశివారెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్తి నేతలంతా ఒకచోట చేరారు. వీరాంజనేయులును మార్చకపోతే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి 50వేలకు పైగా మెజారిటీతో గెలుస్తుందని వైసీపీ నాయకులు తేల్చిచెబుతున్నారు.
ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పి. గన్నవరం సీటును జనసేనకు కేటాయించారు. తాజాగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించారు పవన్. తోలి జాబితాలో పి. గన్నవరం టికెట్ను రాజేష్కు చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే.
డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏపీ మారిందని అన్నారు షర్మిల. మొదటి ఐదు ఏళ్లు టీడీపీ ,తర్వాత 5 ఏళ్లు వైసీపీ..10 ఏళ్లలో రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలకు కేరాఫ్ గా మార్చేశారని ఫైర్ అయ్యారు. డ్రగ్స్ రావడంపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఏపీలో పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ బంగారు భవిష్యత్ కోసమే రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేయాలని భావించి పొత్తు పెట్టుకున్నామని అన్నారు. పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదు అయింది. ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్ అభివృద్ధి పనుల్లో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనా.. దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు.