మిథున్ రెడ్డిVSగల్లా జయదేవ్...మరీ ఇంతలా కొట్టుకోవాలా?
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
చంద్రబాబు అరెస్ట్ మీద ఆంధ్రా ఎంపీలు మాటల యుద్ధం చేసుకున్నారు. అది అక్కడతో ఆగకుండా తరువాత ట్విట్టర్ కు కూడా పాకి చిలిక చిలికి గాలివాన అయింది. బాడీషేమింగ్, వ్యక్తిగత దూషణ స్థాయికి దిగజారింది.
రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు ఆయన కుటుంబసభ్యులు భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కలిశారు. వారితో మాజీ మంత్రి యనమల రామకృష్ణ కూడా ఉన్నారు.
టీడీపీ, జనసేన కలుస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దానిని మరింత ముందుకు తీసుకువెళ్ళాలని రెండు పార్టీలు అనుకుంటున్నాయి. అందుకే ఈ నెలలోనే సమస్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాయి.
జగనన్న ఆరోగ్య సురక్ష అనే గొప్ప పథకాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అవినీతి పరుడు తమ నేతపై తప్పుడు కేసులు పెట్టించాడని విమర్శించారు. జగన్ నుంచి ఎప్పుడూ అబద్దాలే వస్తాయని, ఆయన నోటి నుంచి ఎన్నడూ నిజాలు రావన్నారు.
ఆంధ్రప్రదేశ్ విషమ పరిస్థితుల్లో ఉందని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లాలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన గురించి చర్చించారు.
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిర్ణయం తీసుకుంది..జైలులో ఆయనకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించింది. జైలు శిక్ష అనుభవిస్తున్న చంద్రబాబు ఆరోగ్యం పై ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీ సీఎం ఓ పిచ్చికుక్క అని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన అనిత.. పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి మాట్లాడగానే పిచ్చుకుక్క తన ఊర కుక్కలతో కలిసి విపక్షాలపై అసత్య ప్రచారం చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.