BIG BREAKING: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.
ఇరాన్లోని చాబహర్ ఓడరేవుకు భారత్ ఎంతో మంచి సంబంధం ఉంది. పోర్టు నిర్మాణంలో దాదాపు పదేళ్లుగా భాగస్వామి ఉంది. దీనిపై భారత్ నిధులు కూడా ఎక్కువగా కేటాయిస్తోంది.
అఫ్గానిస్థాన్లో సెంట్రల్ కాబుల్లో భారీ పేలుడు చోటుచేసుకుంది. షహర్-ఎ-నవ్ ప్రాంతంలోని ఓ చైనీస్ రెస్టారెంట్ ముందు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పలువురు చనిపోయినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది నిజంగా సాధ్యమవుతుందా లేదా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. జనాభా గణనే దీనికి అడ్డంకిగా మారొచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం వెండి రేట్లు కూడా బంగారం ధరల్లా పెరిగిపోతున్నాయి. దీంతో సిల్వర్కు కూడా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. చాలామంది వినియోగదారులు దీన్ని పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారు.
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టడీ మృతి కేసులో బీజేపీ బహిష్కృత నేత కుల్దీప్ సింగ్ సెంగర్కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో తనకు విధించిన 10 ఏళ్ల శిక్షను రద్దు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
సమాజ్వాది పార్టీ(SP) వ్యవస్థాపకుడు దివంగత ములాయమ్ సింగ్ యాదవ్ ఇంట్లో చోటుచేసుకుంటున్న విభేదాలు సంచలనం రేపుతున్నాయి. ఆయన కొడుకు ప్రతీక్ యాదవ్ తన భార్య అపర్ణ బిష్ట్ యాదవ్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి పన్ను విధిస్తానని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో EU దేశాలు యాంటీ కోర్సన్ ఇన్స్ట్రూమెంట్ (ACI) ని తెరపైకి తీసుకొచ్చాయి.