'ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియా'
Nirmala Sitharaman : 2022-23లో దేశ జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉందని.. అది 2023-24లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నామన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్సభలో నిర్మలా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంచనాలను అనేక గ్లోబల్ ఏజెన్సీలు చెప్పామని.. మన సొంత RBI ప్రొజెక్షన్ కూడా ఇదే విధంగా ఉందన్నారు నిర్మలా సీతారామన్. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇండియాదేనన్నారు నిర్మల.
ఫోకస్ అంతా మోదీపైనే...మణిపూర్ అల్లర్లపై ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ..!!
Prime Minister Narendra Modi : కేంద్రంలోని మోదీ సర్కార్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా చర్చ సాగుతూనే ఉంది. దీనిపై ఆగస్టు 10 శుక్రవారం ఓటింగ్ జరగనుంది. అవిశ్వాసంపై చర్చకు నేడు ప్రధానమంత్రి సమాధానం చెబుతారు. ప్రధాని ఏం మాట్లాడుతారోనని ఉత్కంఠ నెలకొంది.
'బ్రిటీష్ జనతా పార్టీ'.. హోంమంత్రికి బాధ్యత లేదా? లోక్సభలో రేవంత్ ఫైర్
ప్రపంచంలోనే అత్యధిక అబద్దాలు ఉన్న పుస్తకాలు బీజేపీ మేనిఫెస్టోలంటూ బీజేపీ టార్గెట్గా వ్యంగ్యస్త్రాలు సంధించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా మోదీపై మండిపడ్డారు. మణిపూర్ మండుతుంటే మోదీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రతీ ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారని.. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీ కూడా నెరవేరలేదన్నారు.
విపక్షాల విశ్వాసం కోసమే ఈ అవిశ్వాసం..లోక్సభలో అమిత్షా ఫైర్
నైతికల విలువలు లేని పార్టీ కాంగ్రెస్ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానం విపక్షాల విశ్వాసం కోసమేనని విమర్శలు గుప్పించారు. దేశంలో 50కోట్ల మందికి ఉచితింగా వైద్యం అందిస్తున్నామని.. కరోనా సమయంలో రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యవహరించారని చెప్పారు.
మణిపూర్ సాక్షిగా బీజేపీ భరతమాతను హత్య చేసింది : లోక్ సభలో రాహుల్
లోక్సభలో ఈరోజు వరుసగా రెండో రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ చర్చలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో రాహుల్ మాట్లాడతారని అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ప్రభుత్వం తరపున అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ చర్చలో పాల్గొని తమ పక్షాన నిలబడవచ్చు. అంతకుముందు, చర్చ మొదటి రోజు అంటే మంగళవారం, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. మణిపూర్ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశారు.
లోక్సభలో అవిశ్వాస యుద్ధం..
నిశికాంత్ స్పీచ్పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాహుల్పై నిన్న దూబే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు చైనా నుంచి డబ్బు వచ్చిందన్న దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఆ మాటల్ని ప్రసంగం నుంచి స్పీకర్ తొలగించారు. కానీ తొలగించిన దూబే స్పీచ్ను లోక్సభ వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nirmala-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/modi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/revanth-reddy-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/amitshah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rahul-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rajya-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/pm-modi.jpeg)