AP: వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులకు షాక్
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు, వాలంటీర్లుకు కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. గత ప్రభుత్వం వార్తాపత్రికల కోసమని కేటాయించిన రూ.200 అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.
AP: ఎన్డీఏ శాసన సభా పక్ష సమావేశం ఈరోజు జరగనుంది. ఈ సమావేశానికి కూటమి నేతలు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి హాజరుకానున్నారు. 100 రోజుల పాలన, ఎమ్మెల్యేల పని తీరు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.
మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకంలో మార్పులు తీసుకురాబోతోందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఉన్న పదవీ కాలాన్ని ఎనిమిది సంవత్సరాలకు పెంచదానికి సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. 25% మంది అగ్నివీర్ లను సాయుధ దళాల్లోకి తీసుకునే నిబంధనను 60 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దేశంలో 12 పారిశ్రామిక కారిడార్లు నిర్మిస్తుంటే అందులో ఏపీలో మూడు కారిడార్లు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మూడు కారిడార్ల పై 28 వేల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు హోం మంత్రి అనిత. శాంతి-భద్రతల విషయాల్లో రాజీనామా మీరు చేయాలో.. నేను చేయాలో కాలమే త్వరలో నిర్ణయిస్తుందన్నారు. ఇది డిఎన్ఏ ప్రభుత్వం కాదని సెటైర్లు వేశారు.
బీజేపీ మన రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. NDRF బలగాలను పూర్తి స్థాయిలో పంపలేదన్నారు. వినుకొండ వ్యక్తిగత హత్యను పొలిటికల్ మర్డర్ అని జగన్ కలరింగ్ ఇస్తున్నారన్నారు. అసెంబ్లీలో ఉండాల్సిన జగన్ ఢిల్లీ వెళ్ళడం ఏమిటని ప్రశ్నించారు.
AP: పవన్ కళ్యాణ్ భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు వార్నింగ్ ఇచ్చాయి. అప్రమత్తంగా ఉండాలంటూ పవన్కు సూచనలు చేసింది. కళ్యాణ్ను కొన్ని గ్రూపులు టార్గెట్ చేశాయని కేంద్ర నిఘా వర్గాలు పేర్కొన్నాయి. గతంలో పవన్ తీరును తప్పుబడుతూ మావోయిస్టుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
రాజ్యసభలో తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం తగ్గింది. మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయేకు 12 సీట్లు తక్కువ అయ్యాయి. ప్రస్తుత సంఖ్యా బలం 101గా ఉంది. ఇటీవలే నలుగురు నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్డీయేకు సీట్లు తగ్గాయి.